తెలుగు‘వైభవాన్ని చాటుదాం’..!

  • వైభవ శోభా‘యాత్ర’కు కదలి రండి’
  • 2వ తేదీన రాజమండ్రిలో తెలుగు భాషా వైభవ శోభా యాత్ర
  • విజయవంతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
  • ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌పిలుపు

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

‌జనవరి 5,6,7వ తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరిచుకుని జనవరి 2వ తేదీన రాజమండ్రిలో జరిగే తెలుగు భాషా వైభవ శోభా యాత్రకు విద్యావంతులు,తెలుగుభాషాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌పిలుపునిచ్చారు. జనవరి 2వ తేదీన తెలుగు భాషలోని 25 సాహితీ పక్రియల సాహితీ మూర్తుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ వేలాదిమంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటుతూ రాజమండ్రి పురవీధుల్లో ముందుకు సాగుతారని వివరించారు. 2వ తేదీన ఉదయం 9 గంటలకు దండిమార్చ్ ‌సర్కిల్‌ ‌నుంచి పుష్కర్‌ఘాట్‌ ‌వద్ద శ్రీ రాజరాజ నరేంద్ర విగ్రహం వరకు నిర్వహించే ఈ ర్యాలీ ని విజయవంతం చేయడానికి రాజమండ్రి ప్రముఖులు,విద్యావేత్తలు,అభిమానులు,విద్యార్ధులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.ఈ కార్యక్రమ ంలో విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిధిగా పాల్గొంటున్నా రని,మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ,పార్లమెంట్‌ ‌సభ్యలు మార్గాని భరత్‌ ‌రామ్‌,‌శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,అదిరెడ్డి భవాని,జక్కంపూడి రాజా,మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌,‌మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ••డా ఛైర్మన్‌ ‌రౌతు సూర్యప్రకాశరావు,బిజేపి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు,యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌,‌జక్కంపూడి గణేష్‌లతో పాటు అనేక మంది సాహితీమూర్తులు, నగర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.జనవరి 5,6,7వ తేదీల్లో రాజమండ్రి గైట్‌ ఇం‌జినీరింగ్‌ ‌కళాశాల ప్రాంగణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌, ‌చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కదలిరావాలని గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కోరారు.