‘వ్యాక్సిన్‌’ ‌వేయించుకోవాలి

  • అపోహలు వీడి అంతా వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలి
  • వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ ‌విజయచిహ్నం
  • దేశీయంగా వ్యాక్సిన్‌ ‌తయారు చేయడం గర్వకారణం
  • తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై సందేశం

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌కరోనాపై అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్‌ ‌తమిళసై కోరారు. దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌ప్రత్యేక సందేశం ఇచ్చారు. భారతదేశంలో వంద కోట్ల కొవిడ్‌ ‌టీకాలను ప్రజలకు ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, వైద్య సిబ్బందికి నా నమస్కారాలు. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ.. నేటి వరకు వంద కోట్ల డోసుల పంపిణీకి చేరుకోవడం సంతోషంగా, గర్వకారణంగా ఉంది. మనం టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ టీకాను ప్రజలకు ఇవ్వడంలో ప్రపంచ దేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలిచాం. నేడు భారత్‌ ‌ప్రపంచ దేశాలకు కొవిడ్‌ ‌టీకాను అందించే స్థాయికి చేరింది. మన వాడ, మన గ్రామం, మన పట్టణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ ‌టీకా తీసుకోవాలి. కొవిడ్‌ ‌టీకా తీసుకున్న తర్వాత కూడా జనాలు భౌతిక దూరం పాటించాలి. మాస్కు ఎల్లప్పుడూ ధరిస్తూ, చేతులు తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్‌ ‌నియంత్రణ చర్యల్లో పాల్గొన్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్‌ ‌సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. కొవిడ్‌ ‌టీకాను ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ అని గవర్నర్‌ అన్నారు.దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా సనత్‌ ‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి చేసిన టీకా తీసుకున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు. విదేశాలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు ఎగుమతి చేశాం. దేశ వ్యాప్తంగా వంద కోట్ల మంది టీకా తీసుకున్నారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలి. ఐసీయూలో చేరిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారేనని తెలిపారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలకు కూడా టీకా రానుంది అని గవర్నర్‌ ‌తెలిపారు.