అందరికి వైద్యం అందాలి
- రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
(జిల్లా ప్రతినిధి)
సూర్యాపేట-జ్యోతి న్యూస్
పేద ప్రజలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యంను అందించాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చెస్ట్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వేలాది మంది రోజు కు జిల్లా కేంద్రానికి వస్తుంటారని సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ప్రథమంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చెస్ట్ ఆస్పత్రి ని ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి సహకారంతో పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని, మంత్రి సహకారం తో జిల్లా ఏర్పాటు కావడం అదృష్టమని, జిల్లా ప్రజలకు అనేక సధపాయాలు ఉండేవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చెస్ట్ ఆస్పత్రి నిర్వహకులు డాక్టర్ బి. శ్రీనివాస్,డాక్టర్ వి.మౌని క, కొల్లాపూర్ ఆర్డీవో వి.హనుమానాయక్ ,బిహెచ్ ఇ ఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ బి.బాలాజీ,ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య, ఉపాధ్యక్షుడు రహమతుల్లా,అట్లూరి హరిబాబు, హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు