ఆ‘‌పాఠశాలలను తెరిపించండి’..!

  • మూసేసిన బళ్లను తెరిపించండి
  • బడులను ఊళ్లోలోనే ఉండేలా చూడాల్సిందే
  • చదువుకోసం పట్టణాలకు వెళ్లే దురవస్థ రాకూడదు
  • డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించండి
  • ఉమ్మడి జిల్లాకో స్కిల్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం
  • విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌ ‌కీలక నిర్ణయం

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బడిలేని గ్రామం ఉండరాదని అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలబాలికలు చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలోమూసేసిన పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ….తెలంగాణలో బడి లేని పంచాయతీ ఉండొద్దన్నారు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని రేవంత్రెడ్డి ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డిఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలల్లో ఉన్న అవాంతరాలపై దృష్ఠి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులను తగిన ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ ‌యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యాశాఖకు చెందిన పలు అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ‌ప్రో.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ దేవసేన, సీఎంఓ అధికారులు శేషాద్రి, షా-నవాజ్‌ ‌కాసీం తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్‌ ‌యూనివర్సిటీలు ఉండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ఒరిస్సా, ఆంద్ర ప్రదేశ్‌ ‌రాష్టాల్రల్లో ఉన్న ఈ విధమైన స్కిల్‌ ‌యూనివర్సిటీలని అధ్యయనం చేయాలని సూచించారు. కొడంగల్‌ ‌నియోజక వర్గంతో పాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్‌ ‌యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను, విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించారు.