ఎన్నికల కౌంటింగ్‌కు అనుమతి

  • ఏపీలో జడ్పీటిసి,ఎంపిటిసిల కౌంటింగ్‌కు లైన్‌ ‌క్లీయర్‌
  • ఎన్నికల కౌంటింగ్‌ ‌నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశం
  • హైకోర్టు తీర్పుతో ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
  • తీర్పును స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల

అమరావతి,జ్యోతిన్యూస్‌ :ష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది.సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్‌ ‌పక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ ‌బెంచ్‌ ‌తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ ‌గోస్వామి,న్యాయమూర్తి జస్టిస్‌ ‌జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలు వరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 10‌న కౌంటింగ్‌ ‌నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్‌ ‌బెంచ్‌ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ని ఎస్‌ఈసీ ఆశ్రయించింది. డివిజన్‌ ‌బెంచ్‌ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తెలిపింది.మళ్లీ ఎన్నికలు నిర్వహిం చడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్‌ఈసీ పేర్కొంది. హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్‌ ‌పక్రియకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో వి•డియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్‌ ఎన్నికల పక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య పక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల పక్రియ జరగాల్సి ఉండగా అ?ప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.