సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ముల్లి పావని జంగయ్య యాదవ్ !

ఘట్కేసర్ : మున్సిపల్ పరిధిలో గల నాలుగవ వార్డులో 6 లక్షల నిధులతో జరుగుతున్న CC రోడ్ల పనులను మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వసంత , స్థానిక వార్డు కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ కలసి ప్రారంభిచడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మంత్రి చామకూర మాల్లారెడ్డి సహకారంతో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని , ప్రతి వార్డులో ప్రతి ఇంటికి మంచి నీటి సరపరా అలాగే వీది నల్లాల మరమ్మతులు , CC రోడ్లు, BT రోడ్లు, డ్రైనజీ పనులు, పార్కు ల సంరక్షణ, అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జా కి గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు . ఇక ముందు కూడా ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతిక్షణం పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి , మున్సిపల్ AE శ్రీనివాస్ , వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు