గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఛైర్ పర్సన్ పుట్ట శైలజ !

మంథని : మంథని నియోజకవర్గ కేంద్రంలో గణేష్ నిమజ్జన స్థలాన్ని సోమవారం మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ పరిశీలించారు. మంథని గోదావరి తీరంలో గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు సమయపాలన పాటించాలన్నారు. పోలీసు శాఖ వారు సూచించిన రూట్లలో వరుస క్రమంలో వాహనాలను గోదావరి తీరానికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మంథని సీఐ సతీష్,ఎస్సై చంద్రకుమార్, కౌన్సలర్ గుండా విజయలక్ష్మి-పాపారావులు పాల్గొన్నారు.