మార్పు..మనతోనే మొదలవ్వాలి

లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి

  • ప్రభుత్వాల బాధ్యత ముగిసింది
  • ఇక మిగిలింది పౌరుల బాధ్యత
  • బయటకొచ్చిన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే 
  • కొంతకాలం దాకా సామూహిక దూరం పాటించాల్సిందే
  • వ్యక్తగత పరిశుభ్రత బాధ్యత ప్రతి పౌరునిది..
  • మన తరువాత తరానికి మనమిచ్చే సందేశం ఇదే..
  • ఇంటి వద్దే భోజనాలు చేద్దాం..బయట తిండికి స్వస్తి చెబుదాం
  • మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకుందాం 

హైదరాబాద్: సమాజం ఎప్పుడూ మారుతూ వుంటుంది. ప్రపంచంలో ఏ మార్పు అయినా ఆకాశం నుండి ఊడిపడదు. సమాజంలోనే అందుకు సంబంధించిన చోదకశక్తులు వుంటాయి. బుద్ధిజీవులు వాటిని అర్థం చేసుకొని మార్పును అంగీకరిస్తారు. మరికొందరు వాటికి మానవాతీత శక్తుల్ని అంటగట్టి ఆవేదన చెందుతారు. అనేక భయాందోళనల మధ్య, సవాలక్ష అనుమానాల మధ్య, అనేక అపనమ్మకాల మధ్య, అనంత వేదనలు, ఆవేదనల మధ్య వున్నాం మనం. లాక్ డౌన్లో చాలా రోజులు ఉండిపోతే వైరాగ్యం రావడం కద్దు. చాలా రకాల వైరాగ్యాలున్నాయి. ఎవరి చావుకైనా వెళ్లాచ్చినప్పుడు….ఈ పాడు జీవితం బుద్బుదప్రాయం. ఎప్పుడైనా వెళ్లిపోవాల్సిందే కదా.. చెయ్యకూడని పనులన్నీ చేశాం, ఏం కట్టుకుపోతాం…వంటి భావనలతో సతమతం కావడమే స్మశాన వైరాగ్యం. కడుపులో ఆకలి కేక పెట్టగానే ఈ వైరాగ్యం కాస్త మాయమైపోతుంది. ఆ తర్వాత ఎవరి రోజు వారి జీవితం వారిదే. అలాగే ప్రతి ప్రసవం తల్లికి జీవన్మరణ పరీక్ష. ప్రసవ వేదన భరిస్తూ మొత్తుకుంటుంది…ఆ సుఖం ఎందుకు…ఈ దుఖం ఎందుకు? ఇక పై అసలు పిల్లలనే కనకూడదు అనుకోవడమే ప్రసూతి వైరాగ్యం. కానీ బిడ్డల మీద ప్రేమను వదులుకుంటుందా? రాజకీయ వైరాగ్యం కూడా అత్యంత వేదనాభరితమని కొందరు రాజకీయ నాయకులను చూస్తే అర్థమౌతుంది. ఇలా చాలా వైరాగ్యాలు వున్నాయి. ఇప్పుడు వీటన్నింటి కంటే భీతిగొల్పే ప్రళయ వైరాగ్యం … కరోనా వైరాగ్యం . ‘నెవర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్’ అనేది ఓ పాపులర్ సినిమా డైలాగ్ లాగే, కరోనా తర్వాత ఏమి జరగబోతోంది? అనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఆ తర్వాత జీవితం ఎలా వుంటుంది? అని ప్రశ్నించుకుంటే.. కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్ గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపే లైఫ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ తో రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. లైస్టయిల్ చేంజ్? అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్ షాపులోని మందుల పైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్? చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్?, వాష్?రూమ్? వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్? చేసుకునే సింక్ ? వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్?. ఇంట్లోని ఫ్లోర్?ను ఈజీగా క్లీన్? చేసుకునేలా స్పేస్? ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి. నెలవారీ కిరాణా లిస్ట్ మారాలి ఇప్పటిదాకా కిరాణా లిస్ట్ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్లకే పరిమితమయ్యేది. ఇక పై ఆ లిస్ట్ లో హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇక పై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్ వాష్, బ్యాగ్ లో ఎప్పుడూ శానిటైజర్ ఉంచుకోవాలి. ఆహార అలవాట్లు మారాలి కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి మాత్రమే తినాలి. ఫ్రిజ్ లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్ని రకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి రెగ్యులర్ గా తినాలి. నిజానికి జంక్ ఫుడ్ తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్ లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి శరీరానికి తగినంత ఇమ్యూనిటీ ఉంటే వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్? హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు. వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగు పెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి. ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం చేసుకుంటే సరిపోదు. వైరస్లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్ గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్ చేసుకోవాలి. ల్యాప్ టాప్, ఫోన్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్, కంప్యూటర్, కీబోర్డ్, టీవీ రిమోట్, రిస్ట్ వాచ్, బుక్స్ వంటివి క్లీన్ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే వైరస్ వ్యాప్తి అవుతుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇక పై మారాలి. అలాగని మెడికల్ షాపు నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్?ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దాళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉ ంటుందనే విషయాన్ని గుర్తించాలి.బయట తిరుగుళ్లకు స్వస్తి టైంపాస్ కాకపోతే అలా బయటకి వెళ్లోస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్ చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇక పై అవుట్ డోర్ మీటింగ్స్ ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్, ఆన్లైన్ చాటింగ్ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లాడు. స్వీయ క్రమశిక్షణ అవశ్యం సెల్ఫ్ డిసిప్లిన్ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య దూరం ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.