2 తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా

400 దాటిన వైరస్ కేసులు.. క్రమంగా పెరుగుతున్న మృతులు

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసు రుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ జమాత్ సదస్సు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. కరోనా బాధితుల్లో జమాత్ సదస్సుకి వెళ్లిన వారే ఎక్కువమంది ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది దిల్లీలోని జమాత్ వెళ్లినవారేనని అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలు నగరంలోని రోజా వీధి, అవుకు, బనగానపల్లెలో ఒక్కొ కేసు నమోదైనట్లు వెల్లడించారు. వీరంతా దిల్లీలోని మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారేని వెల్లడించారు. కర్నూలు జిల్లా నుంచి 449 మంది దిల్లీ జమాత్ కు వెళ్లారు. ఇంకా 350 మంది రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఇక తెలంగాణలోనూ కరోనా పంజా విసిరింది. తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 229కి పెరిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ జమాతే సదస్సు కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 11మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు 32మంది కోలుకున్నారు. ప్రస్తుతం 186మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఎం క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 19వేల 368. ర ఇక రాష్ట్రం నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య 1030గా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 925మందిని అధికారులు గుర్తించారు. ఇంకా 105మందిని గుర్తించాల్సి ఉంది. రాష్ట్రం నుంచి మర్కజ్ వెళ్లి వచ్చినవారిలో 161మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న 400మంది అనుమానితుల నమూనాలకు పరీక్షలు చేశారు. మర్కజ్ వెళ్లాచ్చిన వారితో సంబంధం ఉండి పరీక్షించాల్సిన నమూనాలు 600. రాష్ట్రంలో 22 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో 435మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మర్కజ్ వెళ్లోచ్చిన వారిలో 365మంది ప్రభుత్వ క్వారంటైన్ లో ఉన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో కరోనా వైరస్ (కొవిడ్ 19) విజృంభిస్తోంది. ఈ నెల 2వ తేదీ వరకూ నమోదైన మె ఎత్తం కేసుల (154)ను పరిశీలిస్తే.. దాదాపు 50 శాతం కేసులు మహానగర పరిధిలోనే నమోదయ్యా యి. హైదరాబాద్ (50), రంగారెడ్డి (15), మేడ్చల్ (11) జిల్లాల్లో కలిపి 76 కేసులు గుర్తించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17) జిల్లాల్లో నమోదయ్యా యి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను ఇప్పటి వరకూ 20 జిల్లాల్లో కరోనా వైరస్ బాధితులున్నట్లు నిర్ధారణ అయ్యింది. తొలుత అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఈ వైరస్ ఛాయలు కనిపించగా, ఆ తర్వాత దిల్లీ మర్కజకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వెళ్లోచ్చిన ప్రయాణికుల్లో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో వెల్లడైంది. 154 కేసుల్లో 75 (48.70 శాతం) మంది బాధితులు మర్కజ్ కు వెళ్లోచ్చిన వారే. వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా 33 మంది వైరస్ బారిన పడ్డారు. ఇలా మొత్తం 108 మంది మర్కజ్ ప్రయాణికులు, వారితో కలివిడిగా ఉ న్నవారే కావడం గమనార్హం. చిన్న ఇల్లు… పెద్ద కుటుంబం మర్కజ్ కు వెళ్లోచ్చిన కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి పై వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ నిర్ధరించిన కేసుల్లో పాతబస్తీ, కుత్బుల్లాపూర్, నాంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ఆరు కుటుంబాల్లో నలుగురు, అంతకు మించి వ్యక్తుల్లోనూ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో అత్యధికులు చిరు వ్యాపారులు, దిగువ మధ్యతరగతి వారేనని గుర్తించారు. రెండు గదులుండే చిన్న ఇంట్లో ఆరేడుగురికి పైగా జీవిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. గాలి, వెలుతురు సరిగా లేని ఇళ్లలో దగ్గర దగ్గరగా గడపడం వల్ల.. ఒకరి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని వైద్యాధికారుల అంచనా. ఇళ్లన్నీ పక్కపక్కనే ఆనుకొని ఉండడం వల్ల ఇరుగుపొరుగు వారితోనూ కలిసే అవకాశమున్నట్లు గుర్తించారు. లి ఉదాహరణకు హైదరాబాద్ కు చెందిన ఒక వస్త్ర వ్యాపారి (61)కి దిల్లీ వెళ్లోచ్చాక కరోనా సోకినట్లు నిర్ధరించారు. ఈయన తన కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు సహా రెండేళ్ల బాలుడితోనూ వారం రోజుల పాటు గడిపారు. ఆయన మార్చి 18న దిల్లీ నుంచి తిరిగి రాగా, 25న లక్షణాలు కనిపించడంతో తొలుత ఒక ప్రైవేటు ఆసుపత్రిలో, తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన చికిత్స పొందుతూ 30వ తేదీన మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో అందరినీ పరిశీలనలో ఉంచాల్సి వచ్చింది. లి ఇలాగే మరొకరు కూడా కరోనాతో మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 21 మందిని వైద్యపరిశీలనలో ఉంచారు. కీలి డబీర్‌పురాకు చెందిన మరొకరికి కూడా దిల్లీ నుంచి వచ్చాక కరోనా పాజిటివ్ తేలింది. ఈయనతో నేరుగా గడిపిన వ్యక్తులు 12 మంది కాగా, వారితో సన్నిహితంగా గడిపిన మరో 20 మంది ఉన్నారు. వీరిలో ఆరేళ్ల లోపు చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారు. ఇప్పుడు వైద్య సిబ్బంది వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లి మాదన్న పేటకు చెందిన ప్రైవేటు లారీ ట్రాన్స్ పోర్టు వ్యాపారికి కరోనా సోకినట్లు గురువారం నిర్ధారణ అయ్యింది. ఈయన వ్యాపార పనుల నిమిత్తం మార్చి 18 నుంచి 29వ తేదీ వరకూ పదుల సంఖ్యలో వ్యక్తులను కలిశాడు. వీరందరి సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగుల్లో అయిదుగురిని గుర్తించి ఆసుపత్రుల్లో పరీక్షలకు తరలించారు. లి బహదూర్ పురాకు చెందిన వ్యక్తి (60) దిల్లీ వెళ్లి మార్చి 19న హైదరాబాద్ కు వచ్చాక.. 30వ తేదీన లక్షణాలు బయటపడడంతో ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఈయనలో కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ వ్యక్తితో ఒకే చోట గడిపిన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఆరోగ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇందులో ఏడు నెలల చిన్నారి.. బాధితుని మనవరాలు, రెండున్నర ఏళ్ల బాలుడు (మనవడు) కూడా ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫీవరాసుపత్రికి తొమ్మిది మంది అనుమానితులు నల్లకుంట, న్యూస్టుడే: నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మంది కరోనా అనుమానితులు నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో చేరారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన వీరందరిలోనూ కరోనా లక్షణాలుండటంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎల్బీనగర్ నుంచి ఒకరు, చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి ఆరుగురు, మలక్ పేట చెందినవారు ఇద్దరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి 10.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 10 గంటల వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది దిల్లీలోని జమాత్ వెళ్లినవారేనని అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలు నగరంలోని రోజా వీధి, అవుకు, బనగానపల్లెలో ఒక్కొ కేసు నమోదైనట్లు వెల్లడించారు. వీరంతా దిల్లీలోని మర్క లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారేని వెల్లడించారు. కర్నూలు జిల్లా నుంచి 449 మంది దిల్లీ జమాత్ కు వెళ్లారు. ఇంకా 350 మంది రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపా