భాగ్యనగరంలో ఏరోస్పేస్‌ యూనివర్సిటీ

ఏవియేషన్‌ ప్రతినిధుతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శనకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎఫ్‌ఐసీసీఐ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహణ జరుగుతోంది. జ్యోతి ప్రజ్వన అనంతరం ఏవియేషన్‌ ప్రతినిధును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. వింగ్స్‌ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ ప్రదర్శన అన్నారు. కరోనా భయంతో వింగ్స్‌ ఇండియా నిర్వహణపై నీలినీడు కమ్ముకున్నాయన్నారు. కానీ తగు జాగ్రత్తు, ద ృఢ నిశ్చయంతో ప్రదన్శనను సుసాధ్యం చేశారని కొనియాడారు. తెంగాణ రాష్ట్రానికి ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ ప్రాధాన్యత రంగాన్నారు. తెంగాణ వేగంగా వ ృద్ధి చెందుతోన్న రాష్ట్రమని తెలిపారు. రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయా ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదించినట్లుగా చెప్పారు. భద్రాద్రి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ గుదిబండలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా వరంగల్‌ విమానాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు.
వింగ్స్‌ ఇండియా-2020 గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెంగాణ రాష్ట్రం వేగంగా వ ృద్ధి చెందుతోందని.. రాష్ట్రానికి ఏవియేషన్‌, ఎరో స్పేస్‌ు ప్రాధాన్యతా రంగాని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయా ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాకు అవకాశాున్నాయని పేర్కొన్నారు. వరంగల్‌ విమానాశ్రయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దీనికి రీజినల్‌ కనెక్టివిటీ స్కీం, ఉడాన్‌ స్కీమ్‌తో అనుసంధానించాని కేంద్రానికి విన్నవించినట్లు చెప్పారు.హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఎరో స్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు.