గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం

పల్లెల్లో నగదు సరఫరా పెంచే చర్యల్లో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ చెల్లింపుల తీరును ప్రభుత్వం పునస్సమీక్షించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ‘నరేగా’ కేటాయింపుల్లో 60శాతాన్ని వేతనాలకు, 40శాతాన్ని సాధన సామగ్రికి పంచాయతీ స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2016 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో వేతనాలు-సాధన సామగ్రికి కేటాయింపులను జిల్లా స్థాయికే పరిమితం చేసింది. జిల్లాస్థానే పంచాయతీల ప్రాతిపదికన ఈ నిష్పత్తిలో వేతనాలను కేటాయిస్తే పల్లెపట్టులకు మరింత డబ్బు సమకూరుతుందనడంలో సందేహం లేదు. ఉపాధి హామీని మరింత విస్తతీకరించే క్రమంలో ‘హర్‌ ఘర్‌ జల్‌’ (ఇంటింటికీ నల్లా నీరు) కార్యక్రమాన్ని అందులో అంతర్భాగంగా మార్చేందుకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ‘నరేగా’ కార్మికుల వేతనాలను ఎనిమిది శాతం నుంచి 10శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థిక మంత్రి చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘నరేగా’ కార్మికుల జాతీయ సగటు వేతనం రోజుకు రూ.181.57గా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాలతో పోలిస్తే- ‘నరేగా’ వేతనాలు మరీ దిగనాసిగా ఉన్నాయని అంగీకరించక తప్పదు. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా 1991లో 55శాతం కాగా- 2019నాటికి అది ఆందోళనకర స్థాయులకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 55శాతం జనాభా పశువుల పెంపకం, వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో ఉపాధి పొందుతున్నప్పటికీ- జీడీపీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా అంతకంతకూ పతనమవుతుండటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.
విత్తలోటు వల్ల దేశ ఆర్థిక సమతుల్యత దెబ్బతింటున్న మాట నిజమే అయినప్పటికీ, దాని గురించి మరీ అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది భాజపా ఆర్థిక విభాగం అభిప్రాయం. దానికి బదులు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు కొత్త జవసత్వాలు కల్పించేందుకు వీలుగా వాటికి నిధుల తోడ్పాటు విస్తరించాలనిబీ తొలితరం ఔత్సాహికవేత్తలకు ఆర్థిక మద్దతు పెంచాలని ఆ విభాగం ఆర్థిక మంత్రికి సిఫార్సు చేసింది. న్యాయ వివాదాలు, వ్యాజ్యాలు చుట్టుముట్టడంతో ఎంఎస్‌ఎంఈ రంగం కుదేలవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ తలపోస్తోంది. రేపటి బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు రూ.12,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించారు. కిందటి బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు రూ.7,011 కోట్లు కేటాయించారు. దేశ ఉత్పత్తి రంగంలో 45శాతానికి, ఎగుమతుల్లో 40శాతానికి, జీడీపీలో 28శాతానికి ప్రాతినిధ్యం వహించడంతోపాటు 11.10కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలను ఏ రకంగానూ విస్మరించడానికి వీల్లేదు. మరోవంక ఇళ్లు కొనుగోలు చేసినవారి కేసులనూ ‘దివాలా స్మతి’ పరిధిలోకి చేర్చడంతో ఆ చట్టం అమలుకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా గహాల కొనుగోలు కేసులు ఎంతకూ తెమలడం లేదు. దివాలా స్మ తి పరిధినుంచి స్థిరాస్తి కంపెనీల (దివాలా విచారణ ఎదుర్కొంటున్న)ను మినహాయించి- దానికోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. దేశవ్యాప్తంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా వాటి రుణ వితరణ బాగా కోసుకుపోయింది. వాటిచుట్టూ నిబంధనల ఉక్కుచట్రం బిగియడంతో 2019 సెప్టెంబరునుంచీ ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్రమైన నగదు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలనుంచి ఎన్‌బీఎఫ్‌సీలను బయటపడవేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.32 వేల కోట్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తులను కొనుగోలు చేసి వాటికి ఊరట కలిగించేందుకు ఆర్థిక మంత్రి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది