గంజాయి కేసులపై లోతుగా దర్యాప్తు

హైదరాబాద్‌,జూలై24: హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఉత్తరాంద్రనుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణౄ పెరిగింది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న కేసులు చూస్తుంటే చాపకింద నీరులా కొందరు తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరిస్తున్నారు. పోలీసులు నిరంతరంగా శ్రమిస్తూ ఎక్కడిక్కడ దొంగలను పట్టుకుంటున్నారు. గతంలో డ్రగ్స్‌ కేసు బయటపడ్డప్పటి నుండి మొదట కార్పోరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో డ్రగ్స్‌ వినియోగంపై చర్చ జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో సెలబ్రిటీలను కేసులోకి లాగేసింది. గంజాయి 
పెద్ద మొత్తంలోఒ ఇటీవల సిద్దిపేట వద్ద పట్టుబడింది. నిత్యం ఎక్కడో ఓ చోట పట్టుబుతూనే ఉంది. ఈ దశలో కాలేజీలు, స్కూళ్లు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రలు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వారిని ఉచ్చులోకి దించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.