ఐపిఎల్కి కరోనా దెబ్బ
- క్రీడాకారులకు కరోనా పాజిటివ్
- సీజన్ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన
ముంబాయి,జ్యోతిన్యూస్ :
క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కరోనా దెబ్బకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఇంకా ఈ సీజన్లో 30కి పైగా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గ్లోబల్ క్రికెట్ క్యాలెండర్, కోవిడ్ పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్లను రీ షెడ్యూల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్-14 మిగతా భాగా