జగన్కు సీబీఐ నోటీసులు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ఆంధప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రని.. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘరామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్లో వెల్లడించారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు బుధవారం జగన్కు నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై వివరణ ఇవ్వాలని జగన్, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.