లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. “ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అనవసర కారణాలతో రోడ్డ పై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరం లేదు..పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరతలేదు. ఈ రోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉ న్నవారి నిర్బంధం కొనసాగుతుంది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌనన్ను మరి కొన్ని రోజులు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5194కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య 149కి చేరింది.