తెలుగు వెలుగులకు ప్రతిష్టాత్మక‘‘పూర్ణకుంభ పురస్కారాలు’’

  • ప్రకటించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్‌ ‌శ్రీనివాస్‌
  • ‌ప్రపంచ తెలుగు మహాసభలో పురస్కారాల ప్రదానం

రాజమహేంద్రవరం,జ్యోతిన్యూస్‌ :

అం‌తర్జాతీయ స్థాయిలో 72 మంది తెలుగు వెలుగులకు,సంస్థలకు ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌ప్రతిష్టాత్మక ‘‘పూర్ణకుంభ పురస్కారాలను’’బుధవారం ప్రకటించింది.ఈ పురస్కారాలను ప్రపంచ తెలుగు మహసభల్లో భాగంగా జనవరి 5వ తేదీన సాయంత్రం జరిగే సభలో ఎంపిక చేసిన ప్రముఖులకు అందజేయనున్నట్లు ఆంధ్ర సరస్వాత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌, ‌చైతన్యరాజు,రెడ్డప్ప ధవేజిలు తెలిపారు.రాజమహేంద్రవరం గైట్‌ ‌కళాశా ల ప్రాంగణంలో 5,6,7 జనవరి 2024 తేదీలలో మహసభలను అత్యంతవైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. జనవరి 5వ తేదీన నిర్వహించే పూర్ణ కుంభ పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యావరణ మరియు అటవీశాఖా మంత్రి అశ్విని కుమార్‌ ‌చౌబే,విశిష్ట అతిధిగా జస్టిస్‌ ‌బి.కృష్ణమోహన్‌లు పాల్గొంటారని తెలిపారు. పూర్ణకుంభ పురస్కార గ్రహీతల్లో కీర్తిశేషులైన తెలుగు వెలుగుల కుటుంబాల విభాగంలో తరిగొండ వెంగమాంబ(భక్తి సాహిత్యం),కవి మొల్ల(భక్తి సాహిత్యం), కవి తిక్కన సోమయాజీ(ఆంధ్ర పురాణ సాహిత్యం),డొక్కా సీతమ్మ(ఆధ్యాత్మిక సేవా రంగం), గుర్రం జాషువా(సాహిత్యం), శ్రీపాద కృష్ణమూర్తి(ఆధ్యాత్మిక సాహిత్యం),మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి(తెలుగు సాహిత్యం),కందుకూరి వీరేశలింగంపంతులు(సాహిత్య,సేవ రంగాలు),పెద్దింటి దీక్షిత్‌దాసు(హరికథ),దామోదరం సంజీవయ్య(ప్రజాసేవ),బోయి భీమన్న(తెలుగు సాహిత్యం), అల్లూరి సత్యనారాయణ రాజు(ప్రజాసేవ),ఘంటసాల వేంకటేశ్వరరావు(చలనచిత్ర సంగీతం),మండలి వెంకట కృష్ణారావు(తెలుగు భాషా సేవ),సాలూరి రాజేశ్వరరావు (చలనచిత్ర సంగీతం),పి. బి. శ్రీనివాస్‌(‌చలనచిత్ర సంగీతం),బసవరాజు పద్మనాభం (చలనచిత్రం),బాపు(చలనచిత్రం, చిత్రలేఖనం), జంధ్యాల (రంగస్థల నాటక రచన,చలనచిత్రం), సి.వి.రాఘవాచారి (పత్రికా రంగం), తుర్లపాటి కుటుంబరావు(పత్రికా రంగం),జాలాది రాజారావు (తెలుగు సాహిత్యం),కాళీపట్నం రామారావు(తెలుగు సాహిత్య సేవ),సిరివెన్నెల సీతారామ శాస్త్రి(చలనచిత్ర సాహిత్యం), డా.దాసరి నారాయణరావు (చలనచిత్రం),సురభి జమున రాయలు,(సురభి రంగస్థలం), పాతపాటి సర్రాజు (ప్రజాసేవ), వై.కె.నాగేశ్వరరావు (సాంస్కృతిక సేవ),పరవస్తు చిన్నయ సూరి (తెలుగు భాషా వికాసం)లకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా పూర్ణకుంభ పురస్కారాలు విభాగంలో రాజ వంశీకులైన మైలవరం సంస్థానాదీసులు,చింతపల్లి సంస్థానాదీసు లకు ఇవ్వనున్నామని వివరించారు.పూర్ణకుంభ పురస్కార తెలుగు వెలుగులు విభాగంలో బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాల కృష్ణ (తెలుగు వాఙ్మయం),ఆచార్య శలాక రఘునాథ శర్మ(తెలుగు వాఙ్మయం),దాట్ల బుచ్చి వేంకటపతి రాజు(సేవా రంగం),జిత్‌ ‌మోహన్‌ ‌మిత్ర(కళా సేవారంగం),తల్లావఝుల పతంజలి(సాహిత్యం),డా.ఎల్లూరి శివారెడ్డి(సాహిత్యం), రసరాజు(సాహిత్యం),తనికెళ్ళ భరణి(చలనచిత్రం),వేదాంతం రాధే శ్యామ్‌(‌కూచిపూడి నృత్యం), కూచిభొట్ల ఆనంద్‌(‌భారతీయ సంస్కృతి సేవ),బాదం బాలకృష్ణ(సేవారంగం),కె. టి.రామరాజు(సేవారంగం),డా.కె.సుధాకర్‌ ‌రెడ్డి, వనితా రెడ్డి(అంతర్జాతీయ సేవారంగం),డా.టి.గౌరి శంకర్‌,(‌తెలుగు భాషా సేవ),వడలి రమేష్‌ ‌కుమార్‌(అం‌తర్జాతీయ సేవారంగం),మహ్మద్‌ ఆలీ(చలనచిత్రం),కె.వి.ప్రదీప్‌(‌తెలుగు బుల్లితెర),అన్నాబత్తుల నాగమణి(రంగస్థలం),ఆలూర్‌ అశోక్‌ ‌కుమార్‌(‌తెలుగు బుల్లితెర),గోగినేని శిల్ప (గాత్రదానం- బుల్లితెర),చెరుకువాడ రంగ సాయి(సాహిత్యం)లకు పురస్కారాలను అందజేస్తున్నట్లు వివరించారు.అదే విధంగా పూర్ణకుంభ పురస్కారాల్లో భాగంగా పత్రికలు,సాహితీ సాంస్కృతిక సంస్థల విభాగంలో తెలుగు పత్రిక నుంచి వేమూరి బలరాం (స్వాతి పత్రిక),మహ్మద్‌ ‌రఫీ (కళ పత్రిక) – తెలంగాణ సారస్వత పరిషత్‌ ‌నుంచి డా. చెన్నయ్య,వంశీ ఇంటర్నేషనల్‌ ‌నుంచి వంశీ రామరాజు,రసమయి నుంచి యమ్‌. ‌కె. రాము,మద్దాలి రఘురాం(కిన్నెర) ముంబై తెలుగు సంఘం నుంచి బి.సహదేవ్‌,‌ముంబై తెలుగు కాళా సమితి నుంచి మాదిరెడ్డి కొండారెడ్డి,కువైట్‌ ‌కళాసమితి నుంచి పెండ్యాల వేంకటేశ్వరరావు,అమెరికా తెలుగు అసోసియేషన్‌ ‌నుంచి జి. రామచంద్రారెడ్డి,సిల్వాస తెలుగు సంఘం నుంచి కంబాల ఆదికాశి విశ్వేశ్వరరావు, సాహితి సంస్థ గుంటూరు నుంచి సింగం లక్ష్మీనారాయణ,పి. రామచంద్ర రాజు, నవ్యాంధ్ర రచయితల సంఘం నుంచి కలిమిశ్రీ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం(ఒంగోలు), హనుమంతురాయ గ్రంధాలయం(విజయవాడ), గౌతమి గ్రంధాలయం(రాజమహేంద్రవరం),నన్నయ్య భట్టారక పీఠం(తణుకు),సేవ సంస్థ (నెల్లూరు),చింతలూరు ఆయుర్వేద ఫార్మసి(చింతలూరు),నాట్స్ (‌కలిదిండి ప్రేమ్‌ ‌స్వరూప్‌)‌లకు పురస్కారాలను అందజేయనున్నట్లు డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌, ‌చైతన్యరాజు,రెడ్డప్ప ధవేజిలు తెలిపారు.