అసెంబ్లీ ‘నివాళి’

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • దివంతగ సభ్యులకు నివాళి అర్పించిన సభ
  • అనంతరం సోమవారానికి సభ వాయిదా
  • అక్టోబర్‌ 5 ‌వరకు సమావేశాలు జరపాలని బిఎసిలో నిర్ణయం

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్‌,‌హుజూరాబాద్‌ ‌మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయి రెడ్డి,బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్‌ ‌మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మాణాన్ని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ సభ్యులంద రూ నిబంధనలు పాటించాలని స్పీకర్‌ ‌సూచించారు. సంతాపం ప్రకటించిన అనంతరం ఉభయ సభలు సోమవారా నికి సోమవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు శాసన సభ, మండలి సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 5 ‌వరకు జరగనున్నాయి. శాసన సభలోని స్పీకర్‌ ‌చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, ‌మంత్రులు హరీశ్‌ ‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ‌సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతి, అక్టోబర్‌ 3 (ఆదివారం) తేదీల్లో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.