చిన్నారికి న్యాయం జరగాలి !

  • కరకగూడెం ప్రెస్‌ ‌క్లబ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ,మానవహరం

కరకగూడెం :
హైదరాబాద్‌ ‌మహానగరంలో సింగరేణి కాలనీలో గిరిజన చిన్నారిపై కర్కశంగా అత్యాచారం జరిపి చిన్నారిని హత్య చేసిన మానవ మృగంపై సత్వర చర్యలు తీసుకొని తక్షణమే మరణశిక్ష విధించాలని కరక గూడెం ప్రెస్‌ ‌క్లబ్‌ ఆధ్వ ర్యంలో చిన్నారి ఆత్మశాంతి చేకూరాలని నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు.కరకగూడెం మెయిన్‌ ‌రోడ్‌ ‌నుండి పెట్రోల్‌ ‌బంకు వరకు నల్ల బ్యాడ్జి ధరించి ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.ఈ ర్యాలీని ఉద్దేశించి కరక గూడెం ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్షులు ఫరూక్‌ ‌మాట్లాడుతూ..సభ్యసమాజం సిగ్గుపడేలా చిన్నారులపై ప్రతి నిత్యం అకృత్యాలు దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు.ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఎవరైనా మహిళా హక్కులను కాలరాస్తే బాలికల సంరక్షణ విషయమై చట్టాలను అతిక్రమిస్తే బహిరంగంగా మరణ శిక్ష విధిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.నల్ల బ్యాడ్జి ర్యాలీలో చిన్నారి అమర్‌ ‌హై అంటూ,లైంగిక దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ చేసిన నినాదాలు ప్రధాన రహదారిపై ఉన్న మహిళ మణులను కంటతడి పెట్టించాయి.ఈ కార్యక్ర మంలో ఆటో యూనియన్‌ ‌సభ్యులు,సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ సాంబ,కరకగూడెం ప్రెస్‌ ‌క్లబ్‌ ‌పాత్రికేయులు విజయ్‌, ‌రాము,ప్రవీణ్‌,‌సురేష్‌,‌నాగరాజు,ప్రేమ్‌ ,‌మోహన్‌,‌రఫీ,లింగయ్య,శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నార