ఉచితంగా టీకాలు…
- ఇక దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్
- అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా
- 18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్
- రాష్ట్రాలు పైసా కూడా భరించాల్సిన అవసరం లేదు
- ఉచిత వ్యాక్సినేషన్పై కొత్తగా గౌడ్లైన్స్ విడుదల చేస్తాం
- ప్రైవేట్ ఆస్పత్రులు సర్వీస్ ఛార్జి వసూళ్లు కేవలం రు.150 మాత్రమే
- నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం
- కరోనాతో యుద్ధంలో భారత్ గెలుస్తుందన్న వివ్వాసం ఉంది
- కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశం స్వయం సమృద్ధి
- ఇప్పటికే 7 కంపెనీలు తయారీ..మరో మూడు కంపెనీలు సిద్దం
- దీపావళి వరకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగింపు
- జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్మ్యాప్ రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని, రాష్ట్రాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రమే వ్యాక్సిన్లు సమకూర్చి ఉచితంగా ఇస్తుందని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని, రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లపై సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే కరోనా పోరుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించడంతో పాటు సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. దీంతో మోదీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. కేంద్రం పరిధిలోనే ఇక పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుందన్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్రానిదేనని, కేంద్రమే పూర్తిగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు. సోమవారం సాయంత్రం సెకండ్ వేవ్ తర్వాత మొదటి సారి ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్పై కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.150 మాత్రమే సర్వీస్ ఛార్జీ తీసుకోవాలని ఆదేశించారు. కరోనాతో
యుద్ధంలో భారత్ గెలుస్తుందని, నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డాం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారని ప్రశంసించారు. మన శాస్త్రవేత్తలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. ఇంత జనాభా గల దేశంలో వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే మన పరిస్థితి ఏమిటని ప్రశంసించారు. కేంద్రం తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాల వల్లే దేశంలో కరోనాను నియంత్రించడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని మోదీ చెప్పారు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలకు, క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి కేంద్రం మద్దతు తెలిపిందన్నారు. వ్యాక్సిన్ల తయారీలో గతంలో మాదిరిగా చేస్తే వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి చేయడానికి 40 ఏండ్లు పట్టేదని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్లో ఏ దేశంతోనూ వెనుకబడి లేమని, దేశం స్వయం సమృద్ధిగా మారిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని తెలిపారు. మరో మూడు కంపెనీలు తాము తయారు చేసిన వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయన్నారు. చిన్నారులకు టీకా తయారు చేయడానికి భారీగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. మరోవైపు నాసల్ స్పే్ర వ్యాక్సిన్ కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా త్వరలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగవంతం అవుతుందని చెప్పారు. పేదలు, చిన్నారులకు అన్ని రకాల టీకాలు 90 శాతం వేయ గలిగామన్నారు. ఇప్పటి వరకు 23 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు. వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కరోనా కారణంగా పేదలను ఆదుకునేం దుకు దీపావళి వరకు పీఎం గరీభ్ కళ్యాణ్ అన్నదాన యోజన పథకం కొనసాగు తుందని,పేద ప్రజల కు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నా రు. ఈ మేరకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తు న్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటార ని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్ను కేంద్రం అమలు చేసింది.