ఆపదలో ‘అండ’గా…
- నేడు వరంగల్ ఎంజిఎంకు సీఎం కేసీఆర్
- ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్న మంత్రులు
- జిల్లాల్లో ఆస్పత్రులను సందర్శించి రోగుల్లో భరోసా
- నిత్యం జిల్లా ఆస్పత్రులను సందర్శిస్తున్న మంత్రులు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
హైదరాబాద్ గాందీ ఆస్పత్రిలని సందర్శించి కరోనా రోగుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. రోగుల్లో ఆత్మ స్థయిర్యం నింపేలా సిఎం కెసిఆర్ ఆస్పత్రిని సందర్శిస్తారని సమాచారం.. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం లక్ష్యంగా సీఎం చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రు లను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. బుధవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించి కొవిడ్ రోగులతో మాట్లాడారు. కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు సైతం వరంగల్ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు తమ పరిధిలో ఉన్న ఆస్పత్రులను సందర్శించి కరోనా వైద్యంపై ఆరా తీస్తున్నారు. కరోనా రోగులకు ధైర్యం చెబుతున్నారు. కామారెడ్డి కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ..రు అందిస్తున్న చికిత్స కంటే రు కల్పించే భరోసాతోనే బాధితులు త్వరగా కోలుకుంటారని మంత్రి అన్నారు. అలాగే కొవిడ్ వార్డులో విధుల్లో ఉన్నవారు ఐదుగురు పేషంట్స్ కి ఒకరు బాధ్యులుగా ఉండాలన్నారు. అలా ఐదుగురికి ఒకరు మానిటరింగ్ చేయడం వల్ల పేషంట్ పరిస్థితి కచ్చిత అంచనా కు తెలుస్తుందన్నారు. ప్రతి గంటకు ఒక్కసారి పేషంట్ కండిషన్ రికార్డ్ చేయాలని సూచించారు. ఇకపోతే మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు గురువారం సందర్శించారు. కొవిడ్ బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో 219 రెమ్డెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మెదక్ జిల్లాలో సరిపడ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దు అని సూచించారు. ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందిం చారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు ఇంటికి ఒక్కరే బయటకు వచ్చి తీసుకుని వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత గురించి మాట్లాడం జరిగిందని, త్వరలోనే వ్యాక్సిన్ అన్ని వయసుల వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి హరీష్రావు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే మనోధైర్యమే అసలైన మందు అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా బాధితలకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంద న్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలను సందర్శించి కొవిడ్ రోగులను పరామర్శిం చారు. వారి యోగక్షేమాలు తెలుసు కున్నారు. మంత్రి కరోనా రోగులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాయన్నారు.ఎట్టి పరిస్థితిలోను మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకొని భౌతిక దూరం పాటించటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. ఒకవేళ కోవిడ్ వచ్చినా వెంటనే వైద్యం తీసుకొని హోం ఐసోలేషన్ లో ఉంటే త్వరగా బయట పడతారన్నారు. లాక్డౌన్తో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ లు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు చాలా బాగా పని చేస్తూ రోగులకు సేవలు చేస్తున్నరని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, దవాఖాన ఆర్ఎంవో చైతన్య గౌడ్, సూపరింటెండెంట్ హరీష్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ కొరత రాకుండా సీఎం కేసీఆర్ పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆందులో భాగంగానే స్త్రీనిధి ద్వారా రూ.50లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు రాష్ట్రంలోని 8ప్రభుత్వ దవాఖానలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లోని టిమ్స్ దవాఖానకు-10, వరంగల్లోని ఎంజీఎం-5, వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు-4 చొప్పున మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ దవాఖానకు-10, జనగామ జిల్లాలోని కొడకండ, పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3 చొప్పున, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి-4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 104 ఏళ్ల ముసలమ్మ కూడా కొవిడ్ నుంచి కోలుకుందని చెప్పారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారంలలో కొవిడ్ వార్డులను మంత్రి, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర అధికారులు, నేతలతో కలిసి సందర్శించారు. కొవిడ్ వార్డులలో ఉన్న వసతులు పరిశీలించారు. కొవిడ్ రోగులను పరామర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసు కున్నారు. రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో కొవిడ్ కట్టడి కోసం గ్రామ కమిటీలు చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో పంపించాలని ఆదేశించారు.