ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ‌ప్రకటిస్తే ఎలా ?

  • తక్కువ సమయంలో ప్రజలు సొంతూళ్లకు ఎలా వెళతారు
  • కూలీలు, వసల కూలీల పరిస్థితి ఏమిటో ఆలోచించారా
  • సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపే అధికారం ఎవరిచ్చారు
  • మందుల ధరలు,ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి
  • మలివిడత విచారణలో ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా రేపటి నుండి లాక్‌ ‌డౌన్‌ అం‌టే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయని అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ ‌లేవని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌తెలిపారు. లైఫ్‌ ‌సేవింగ్‌ ‌డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలప డానికి హైకోర్టును అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్‌ అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచమ ంతా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిట్లళై చర్యలు తీసుకోమని తామెలా చెప్తామని అన్నాది. అంతర్‌ ‌రాష్ట్ర సరిహ ద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సరిహద్దు ల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ ‌నిలి పివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది. అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలూ లేవని ఏజీ హైకోర్టుకు నివేదించారు. అయితే మౌఖిక ఆదేశాలేమైనా ఉన్నాయా? అని మరో ప్రశ్న వేసింది. ఈ విషయాన్ని సీఎస్‌ను అడిగి చెబుతామని ఏజీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషెంట్లు ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తుంటారని, అలా అని ఢిల్లీలో అంబులెన్స్‌లను ఆపేస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడమేంటని అసహనం వ్యక్తం చేసింది. గతంలో తాము సూచించినట్లు మొబైల్‌ ‌టెస్టులను కూడా చేయలేకపోయారని, కానీ ఇప్పుడేమో అంబులెన్స్‌లను మాత్రం ఆపేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ అనేది ఓ మెడికల్‌ ‌హబ్‌ అని, ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని పేర్కొంది. ప్రజలను ఇక్కడికి రావొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని నిలదీసింది. హాస్పిటల్‌ ‌లో వైద్యం కోసం వచ్చే వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిచింది. కేర్‌, అపోలో ఆస్పత్రిలో అంతర్జాతీయ రోగులు కూడా ఉంటారని, అలాగని వారిని కూడా అడ్డుకుంటారా ? అని చురకలంటించింది. అయితే ఛత్తీస్‌గఢ్‌, ‌మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఆర్‌ఎం‌పీ పిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం నుంచి 10 రోజులు పాటు లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తున్నామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అనంతరం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు ఏజీ తెలిపారు.