ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా
అమరావతి,జ్యోతిన్యూస్:
ఆంధప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీ హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లా డారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభి ప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు.పిల్లల ప్రాణాల మీద,వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని, ఇందుకోసం తగు ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.దేశంలో,రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తలు చూస్తున్న విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వంగా పరిగణ నలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని మంత్రి సురేష్ తెలిపారు.