శరవేగంగా… అనుమతులు

  • – ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాల పెంపు
  • – మరిన్ని సంస్కరణలతో మరింత ముందుకు
  • – అధికారులతో సమీక్షించిన మంత్రి కేటిఆర్‌

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాలను పెంచేందుకు నూతన సంస్కరణలు తీసుకురావాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. నూతన సంస్కరణలతో రాష్ట్ర ప్రయోజనాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాల పెంపుపై ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, పలు శాఖల అధిపతులు హాజరయ్యారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌కు కేటీఆర్‌ ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేపట్టే సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు చేయాలన్నారు. టీఎస్‌ బీపాస్‌ అనేది చారిత్రాత్మక చట్టమని పేర్కొన్నారు. చట్టం అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమన్నారు. టీఎస్‌ బీపాస్‌ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమిం చాలని ఆదేశించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మరిన్ని సంస్కరణలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాల పెంపుపై కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు. సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూ ల మార్పులు తెస్తామని మంత్రి పేర్కొన్నారు. పౌరులకి అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు.. ప్రత్యేకంగా సిటిజన్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌కు ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. టీఎస్‌ బీపాస్‌ అమలుపైనా సమావేశం లో చర్చించామని, చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాల ను మరింత పెంచాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. దీనికి సంబంధించి నూతన సంస్కరణలు తీసుకు రావాలని అన్నారు. బుధవారం దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సంస్కరణలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌కు మంత్రి ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేసే సంస్కరణతో ఆయా శాఖల పనితీరులో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రవిశంకర్‌ను అభినందించిన మంత్రి కెటిఆర్‌

చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రవిశంకర్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. చొప్పద ండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన రైతు తొందుర్తి సుధాకర్‌ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. ఆ కుటుంబానికి రైతుబీమా పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షల చెక్కును మంజూ రు చేసింది. ఈ చెక్కును ఎమ్మెల్యే రవిశంకర్‌ నేరుగా ఆ రైతు ఇంటికి తీసుకెళ్లి, కుటుంబ సభ్యులకు అందజేశారు. సుధాకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. దీనిపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఎమ్మెల్యే రవిశంకర్‌ స్వయంగా రైతు కుటుంబం వద్దకు వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపి, రూ. 5 లక్షల చెక్కును అందజేయడం సంతోషంగా ఉందన్నారు.  రాష్ట్రంలోని అన్నదాతలకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు తెలంగాణ సర్కార్‌ ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తోంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుల ను ప్రభుత్వం ఆదుకుంటోంది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున సంవత్సరానికి రెండుసార్లు రైతులకు రైతుబంధు పథకం కింద నగదును చెక్కు రూపంలో అందిస్తోంది. అదే విధంగా రైతు అనారోగ్యంతో లేదా ఇతర కారణాల చేత చనిపోతే ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల చెక్కును ప్రభుత్వం ఇస్తోంది. 2018 ఆగస్టు 14న సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా రైతు బీమా పథకం ప్రారంభమైంది.