దేశవ్యాప్త లాక్ డౌన్ పై మార్గదర్శకాలు
ఇవే గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- నిత్యావసరాల పంపిణీకి ఆటంకాలుండవు
- మే 3 వరకూ ప్రయాణ సర్వీసుల నిలిపివేత
- జన సమూహ సంస్థలన్నీ మూసేవుంటాయి
- మత సంబంధిత కార్యక్రమాలన్నీ రద్దు
- అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో అనుమతి
- 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, క్రయవిక్రయాలు
- విపత్తుల నిర్వహణ చట్టం
- 2015 ప్రకారం మార్గదర్శకాలు
- వైద్య సర్వీసులన్నీ యథాతథంగా నడుస్తాయి
- హాట్ స్పాట్ పరిధిలో లేని ప్రాంతాలకే మినహాయింపులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ఈత కొలనులు, బార్లు మూసిఉంటాయని పేర్కొంది. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి పాల్గొనడానికి అనుమతి లేదని తెలిపింది. ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉ త్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు మండీలకు అనుమతిస్తామని వెల్లడించింది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి వ్యక్తులు ఎట్టిపరిస్థితుల్లో సరిహద్దులు దాటకూడదని పేర్కొంది. నిబంధనల మేరకు నిర్దేశిత సరిశ్రమలు, వాణిజ్య సంస్థలకే అనుమతులు లభిస్తాయని తెలిపింది. విపత్తుల నిర్వహణ చట్టం-2015 ప్రకారం మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలను అమలుచేయాలని వెల్లడించింది. ఆస్పత్రులు, టెలీమెడిసిన్ సర్వీసులు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథంగా నడుస్తాయని తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతించింది. వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు, వ్యవసాయ యంత్ర పరికరాలు కిరాయికిచ్చే సంస్థలకు, విత్తనోత్పత్తి సహా పురుగుల మందుల దుకానాలకు అనుమతించింది. బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని ప్రకటించింది. లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. గైడ్ లైన్స్ ఇవే -ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి – వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ -అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ – సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్ లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, ఈత కొలనులు, బార్లు మూసివేత – విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత – మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం -ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు యథాతథం -పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు. – ఉపాధి హామీ పనులకు అనుమతి, – అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి – రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి – వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి – వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి – విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి – బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం – అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి – రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి -ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ – గోదాములు, శీతల గోదాములకు అనుమతి -ఈ కామర్స్ సంస్థలు, వాహనాలకు అనుమతి -వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి -ఎలక్టీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్ మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతి -గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి -బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు -బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి -భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు -ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథం -ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. హాట్ స్పాట్ జోన్లను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి. ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు.