ఆ..నలుగురూ..వెంటరారు!
కరోనా కాలంలో అంతిమయాత్రకు..అయినవారూ దూరమే
- అంతిమయాత్రకు అనుమతించాలని బంధువుల వేడికోలు
- ముగ్గురు లేదా నలుగురికంటే అనుమతించని అధికారులు
- కేవలం సొంత రవాణా ఉన్నవారికే సౌలభ్యం
- పేదవారికి దక్కని కడచూపులు
- ఆలస్యంగా వస్తున్న అంబులెన్సులు
- ఇలాంటి సమయంలో చావులు రాకూడదు
- వృద్ధులు ఉన్న ఇళ్లల్లో భయాందోళనలు
హైదరాబాద్: రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ వచ్చింది కదా, లాక్ డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్ డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ “ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?” అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం.అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్ట్రాన్లో ఏం జరిగినా ఎవ్వరూ రాలేని పరిస్థితి. కొవిడ్-19 మృతుల దహన సంస్కారాలకు కొన్ని శ్మశాన వాటికల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నిర్వాహకులు అంత్యక్రియలు జరిపేందుకు వీలు లేదని వెనక్కి పంపుతున్నారు. వారిని ఒప్పించేందుకు బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరి తంతు ముగిసే వరకూ బంధువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనా రాకాసి అష్టకష్టాలు పెడుతోంది. వైరస్ బారిన పడిన వారి పరిస్థితి మరి దయనీయంగా మారుతోంది. వీరు ఎవరినీ కలవడానికి వీలు లేదు. కొన్ని రోజుల పాటు నిర్భందంలో కొనసాగాలి. వీరు ఒకవేళ చనిపోతే..మాత్రం పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. అంత్యక్రియలకు సంబంధిందించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సాంప్రదాయాల ప్రకారం….వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టింది. అనుమానిత | నిర్ధారిత మృతుల అంత్యక్రియల్లో ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబసభ్యులకు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం లభించనుంది. డెడ్ బాడీని కనీసం ముట్టుకోవడానికి కూడా వీలుండదు. ముఖం కనిపించే విధంగా ప్లాస్టిక్ షీట్ లో చుడుతారు. లీక్ ప్రూఫ్ జిప్ బ్యాగులో ప్యాక్ చేస్తారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి బంధువులు, కుటుంబసభ్యులు ముందుకు వస్తే.. కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతినిస్తారు. వీరంతా..సొంత రవాణా సదుపాయం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆసుపత్రి వైద్యుడు అందించిన మాస్క్ లు, గ్లోవ్స్ ధరించాలి. 4 మీటర్ల దూరాన్ని పాటించాలి. ఆయా మతాలకు సంబంధించి ప్రార్థనలు చేసుకోనే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు కూడా పలు నిబంధనలు పెట్టారు. హిందువులయితే… 3 మీటర్లున్న పొడవైన కట్టెతో డెడ్ బాడీకి నిప్పు పెట్టాల్సి ఉంటుంది. అంత్యక్రియల్లో 4 మీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఇతర పనులన్నీ ప్రభుత్వం నియమించిన వ్యక్తులు పూర్తి చేస్తారు. కార్యక్రమాలు పూర్తికాగానే.. వ్యక్తులందకరూ తమ పీపీఈలను ప్రత్యేక కవర్ లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. బాడీ హ్యాండర్లు పీపీఈ తో పాటు వాహనం పై సోడియం హైపో క్లోరైడ్ ను పిచికారీ చేయాలి. హిందువులు : శ్మశాన వాటికకు చేరే ముందు..దహన సంస్కారం చేయడానికి అవసరమైన కర్రలు, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు టైం స్లాట్ ను కుటుంబసభ్యులు ముందుగానే తీసుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలుసుకున్నాక.. ఆసుపత్రి సీఎల్ ఓ డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి బయటకు పంపాలి. అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన రక్షణ ఏర్పాట్లను %+నవీజ% ఏర్పాటు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. ముస్లింలకు : మృతుడి శరీరాన్ని ప్లాస్టిక్ షీట్ లో చుడుతారు. తెల్లటి కాటన్ వస్త్రం కప్పుతారు. ముక్కు రంధ్రాలను దూదితో మూసివేస్తారు. నోరు తెరుచుకోకుండా మూసివేస్తారు. డెడ్ బాడీని చుట్టకముందు రసాయనాలు ప్ర్పే చేస్తారు. క్రైస్తవులకు : మృతుడి కుటుంబసభ్యులు కఫిన్ (పెట్టె) సమకూర్చాలి. అనంతరం కపిన్ ను ఆసుపత్రికి పోలీసులు, వైద్యులు తరలించాలి. కఫిన్ బాక్సు మూతను కొద్దిగా తెరిచి కేవలం ఐదు మందికి మాత్రమే కడసారి చూసేందుకు అనుమతినిస్తారు. కుటుంబసభ్యు సూచించిన ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. స్థలం లేకపోతే… అందుబాటులో ఉ న్న స్థలాల్లో డెడ్ బాడీస్ కు జీ హెచ్ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా ప్రత్యేక అంబులెన్స్ లో తరలిస్తారు. కొవిడ్-19 మృతుల దహన సంస్కారాలకు కొన్ని శ్మశాన వాటికల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నిర్వాహకులు అంత్యక్రియలు జరి పేందుకు వీలు లేదని వెనక్కి పంపుతున్నారు. వారిని ఒప్పించేందుకు బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరి తంతు ముగిసే వరకూ బంధువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనాతో వ్యక్తి మరణించినట్లు నిర్ధారించాక వైద్యులు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నారు. కేవలం ఐదుగురు మాత్రమే రావాలన్న ప్రభుత్వ నిబంధనను గుర్తుచేస్తున్నారు. చాలా సందర్భాల్లో అనుకున్న దానికన్నా తక్కువ మందే వస్తున్నారు. చివరి చూపు అనంతరం శ్మశానంలో ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు చెబుతున్నారు. ఈ లోపు జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో.. మృతదేహం పై వైరస్ నిరోధక ద్రావణం పిచికారీ చేసి, జిప్ బ్యాగ్ లో ఉంచి సీల్ వేస్తారు. శ్మశానంలో ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం రాగానే ఆసుపత్రి వెలుపల సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు. మృతుడి ముఖం కనిపించేలా ఉన్న సంచి ఉండడంతో.. గుంత చుట్టూ నాలుగు మీటర్ల దూరంతో గీసిన గీత వెలుపల నుంచి బంధువులకు.. కడసారి చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం ప్రమాణాల ప్రకారం తవ్విన 8 అడుగుల గుంతలో మృతదేహాన్ని పూడ్చి, ఈ క్రమంలో రెండు సార్లు క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది దుస్తులను భస్మీకరణానికి పంపుతున్నారు. తప్పని జాప్యం.. కొవిడ్ మృతులను ఖననం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. జీ హెచ్ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు ఉ న్నారు. మృతదేహం తరలింపులో మొదటి నుంచి జాప్యం జరుగుతోంది. అంబులెన్సులు ఆలస్యంగా వస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రైవేటు ఆసుపత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చి, అంతలోనే మ ృతిచెందిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు ఐదు గంటలు పట్టిందని పోలీసులు చెబుతుండగా, జీ హెచ్ఎంసీ అధికారులు ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన సమయంతో తమకు సంబంధం లేదని, సంచిలో ప్యాకింగ్ చేసి, శ్మశానానికి తీసుకెళ్లమని చెప్పినప్పుడు తాము అంబులెన్సును పంపిస్తున్నామని చెబుతున్నారు. ఈ మధ్యలో వైద్య సిబ్బంది మృతదేహాన్ని క్రిమి రహితం చేయడం, అదే సమయంలో మ తుడి బంధువులు శ్మశానంలో ఏర్పాట్లు చేసుకోవడం వంటి కార్యక్రమాలు ఉ ంటున్నాయని ఏఎంవో హెచ్ రవిందర్ గౌడ్ ‘ఈనాడు’కు తెలిపారు. ఆయా ఆచారాల ప్రకారం అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. కొన్ని శ్మశాన వాటికల నిర్వాహకులు అంత్య క్రియలకు ఒప్పుకోవడం లేదని, అలాంటి సందర్భాల్లో సమయం పడుతోందన్నారు.