లాక్ డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చు

అఖిలపక్ష నేతల సమావేశంలో మోదీ 

  • జీవితం మునుపట్లా ఉండకపోవచ్చన్న ప్రధాని
  • ఒకేసారి ఎత్తివేతకు అనుకూలంగా లేని పరిస్థితులు 
  • సాధ్యాసాధ్యాల పై సూచనలు స్వీకరించిన ప్రధాని
  • ప్రీ కరోనా పోస్ట్ కరోనాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి
  • సామాజిక, వ్యక్తిగత మార్పులు అవశ్యం –
  • కరోనా కట్టడి మందుల సాయం అడిగిన బ్రెజిల్ అధ్యక్షుడు 

” కోవిడ్-19 వ్యాపించిన తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా అన్నట్లుగా ఉంది. సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు రావాల్సి ఉంది” 

-నరేంద్రమోదీ 

న్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్ దీనికి హాజరయ్యా రు. వైరస్ కట్టడికి, లాక్ డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కేంద్ర వైద్య, సూమ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరత గురించి నేతలు సమావేశంలో లేవనెత్తారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆ పేయాలని మరికొందరు పేర్కొన్నారు. మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని.. ఈ విషయం పై సలహాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు.. త్వరలోనే ముఖ్యమంత్రులతో చర్చిస్తానని తెలిపారు. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 24న విధించిన లాక్ డౌన్ ఎత్తివేత గడువు సమీపించడం సహా దేశంలో నానాటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ కోవిడ్-19 వ్యాపించిన తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా అన్నట్లుగా ఉంది. సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు రావాల్సి ఉంది” అని పేర్కొన్నారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్, శివసేన నుంచి సంజయ్ రౌత్, బిజు జనతాదళ్ నుంచి పినాకీ మిశ్రా, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎస్ సీ మిశ్రా, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, శిరోమణి అకాలీదళ్ నుంచి సుబ్బీర్ సింగ్ బారల్, జనతాదళ్ నుంచి రాజీవ్ రంజన్ సింగ్ సహా ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం. ఈ సమావేశంలో రామ్ గోపాల్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సతీశ్ మిశ్రా (బహుజన్ సమాజ్ పార్టీ), చిరాగ్ పాసవాన్ (లోక్ జనశక్తి పార్టీ), టీఆర్ బాలు (డీఎంకే), సుఖ్ బీర్ సింగ్ బాదల్ (శిరోమణీ అకాలీదళ్), రాజీవ్ రంజన్ సింగ్ (జనతాదళ్ యునైటెడ్), పినాకి మిశ్రా (బిజూ జనతాదళ్), సంజయ్ రౌత్ (శివసేన) సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట్లో తృణమూల్ నిరాకరించినప్పటికీ అనంతరం సుదీప్ బందోపాధ్యాయ హాజరయ్యారు. బుధవారం ఉదయానికి భారత్ లో 5,194 మందికి కొవిడ్-19 సోకింది. 149 మంది మృతిచెందారు. హనుమజయంతి రోజున బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో … ప్రధాని మోదీతో రామయణ సన్నివేశాన్ని గుర్తు చేశారు. కరోనా రోగుల చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బొల్సనారో.. ప్రధాని మోదీని ఓ లేఖలో కోరారు. దాంట్లో ఆయన రామాయణ ప్రస్తావన తెచ్చారు. లక్ష్మణుడిని కాపాడేందుకు హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చారన్నారన్నారు. అలాగే పేదలను కాపాడేందుకు జీసెస్ కూడా ఎన్నో మహిమలు ప్రదర్శించి రోగాలను పారద్రోలారని, ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఇచ్చి మమ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో ఇవాళ మోదీకి లేఖ రాశారు. బ్రెజిల్ కు పూర్తి సహకారం చేస్తామని మోదీ భరోసా ఇచ్చారు.