‘మహా’ విభేదాు!

ఠాక్రే తీరుపై ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ అసంతృప్తి

ముంబయి: మహారాష్ట్రలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పడి నాుగు నెలు కూడా పూర్తికాకుండానే కూటమి మధ్య అభిప్రాయభేదాు మొదలైనట్లు తొస్తోంది. భీమా కోరెగావ్‌ కేసు, ఎన్‌పీఆర్‌ విషయంలో ఠాక్రే వ్యవహరించిన తీరుపై మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ మంత్రుతో పవార్‌ సమావేశానికి పిుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భీమా కోరెగావ్‌ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గతవారం కేంద్రానికి స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్న పుణె న్యాయస్థానం.. కేసును ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. అయితే ఉద్ధవ్‌ నిర్ణయాన్ని మహారాష్ట్ర  సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామి అయిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం ద్వారా ఉద్ధవ్‌ పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. దీంతో కూటమి మధ్య విభేదాు మొదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) ప్రక్రియ చేపట్టేందుకు ఉద్ధవ్‌ ఆసక్తి చూపించడం కూడా కూటమిపై ప్రభావం చూపించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించినప్పటికీ మే 1 నుంచి ఎన్‌పీఆర్‌ అము చేయాని ఠాక్రే భావించడంతో విభేదాు ముదిరినట్లు తొస్తోంది. దీంతో ఎన్సీపీ తమ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నేడు ఎన్సీపీ మంత్రుతో సమావేశం కానున్నారు. తాజా పరిణామా నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.