పోటెత్తిన జాతర
మేడారం సందర్శించుకున్న లక్షలాది భక్తులు
హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం జాతర అంగరంగ వైభంగా ప్రారంభమైంది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతరకు తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లుపూర్తిచేశారు. తాగునీటి సమస్య రాకుండా నీటి సరఫరా ఏర్పాట్లుచేశారు. రోడ్ల మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లుచేశారు. వాహనాల పార్కింగ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అమ్మవారి గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా బ్యారికేడ్లను నిర్మించారు. అత్యంత భక్తి భావంతో లక్షలాది మంది భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకునేందుకు పోటీపడుతున్నారు. జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుజరగకుండా తెలంగాణ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో నారోగ్యానికి గురికాకుండా ప్రత్యేకంగా వైద్యసేవలు అందించేదుకు వైద్యశిబిరాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అత్యవసరపరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. సమ్మక్కసారలమ్మలను భక్తి ప్రపత్తులతో కొలిచేభక్తుల సౌకర్యార్ధం తాత్కాలిక టెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఒక తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా మేడారం సమీపంలో కాటేజీల నిర్మాణం చేపట్టారు. జాతరకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలోభక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. ఇక జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇవే కాకుండా కొందరు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక శాఖ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. పర్యాటకశాఖ ఏకంగా హైలికాప్టర్ సేవలను కూడా ప్రవేశ పెట్టింది. దీంతో కాస్త డబ్బున్న వారైతే నేరుగా హెలికాప్టర్లో వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంగరంగ వైభంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈనెల 9వ తేదీ వరకూ జరగనుంది.
గిరిజన జాతర మేడారం సమ్మక్కసారలమ్మల జాతర సజావుగా జరిగేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో క షి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ఆయా శాఖల అధికారులనుఆదేశించారు. బుధవారం మేడారం వచ్చిన సీఎం ఆయా శాఖల వారీగా చేపట్టిన పనులు, కల్పించిన సౌకర్యాలు, కేటాయించిన నిధుల పై సీఎస్ సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి మేడారం ఆలయ ఆవరణలో జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆయన హెలిప్యాడ్ వద్ద జంపన్నవాగు నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తూ గద్దెల వరకూ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలని అన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జాతరలో అన్నిపనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేశారని అధికారులను ప్రశంసించారు. జాతర విజయవంతానికి వేసిన ప్రణాళికలు అమలు పర్చాలని అన్నారు. అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. పారదర్శకంగా, బాధ్యతాహితంగా అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రోజూ జాతర ఏర్పాట్లు, భక్తుల రాకపై సమీక్షిస్తున్నారని అన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు మేడారం వచ్చి రోజూ వారి క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ను కేటాయించారని చెప్పారు. ముఖ్యమంత్రి జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను గమనించాలని అన్నారు. ప్రతి భక్తుడి కి తల్లుల దర్శనం సజావుగా జరగాలి. మంచి జ్ఞాపకాలతో భక్తులు మేడారం నుంచి వెళ్లేలా చూడాని అన్నారు.