వహ్వా..మహువా
మహువా మొయిత్రా, ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా వినిపిస్తున్న పేరిది. త ణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన ఈమె ఒకే ఒక్క స్పీచ్తో సోషల్ మీడియా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. ఇటీవల లోక్సభ వేదికగా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది.
అంతేకాకుండా ఈ దశాబ్దపు అత్యుత్తమ స్పీచ్ అదేనంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పశ్చిమబెంగాల్లోని కష్ణానగర్ ఎంపీగా గెలిచిన మహువా మొయిత్రా తొలిసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ప్రధాని మోడీ నేతత్వంలో ఉన్న బీజేపీపై ఏ ప్రతిపక్ష ఎంపీ చేయని విధంగా విమర్శలు ఎక్కుపెట్టిన మహువా మొయిత్రా టాక్ ఆఫ్ది పాలిటిక్స్ అయ్యారు. బీజేపీ సర్కార్ జాతీయ భద్రత పేరిట ఊరూపేరు లేని ఓ బూచిని స ష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మహువా మొయిత్రా తన తొలి ప్రసంగంలోనే బీజేపీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేశారు.
మహువా మొయిత్రా తన 15వ ఏటనే అమెరికాకు వెళ్లారు. అక్కడే చదువును పూర్తి చేశారు. ప్రఖ్యాత జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో చేరి న్యూయార్క్, లండన్లో పనిచేశారు. పనితీరును గుర్తించి వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని కట్టబెట్టారు.
2008లో బ్యాంకింగ్ రంగాన్ని వదిలేసిన మహువా మొయిత్రా భారత్కు తిరిగి వచ్చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఆమ్ ఆద్మీకా సిపాయి ప్రాజెక్టు కోసం పనిచేశారు. తరువాత త ణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ క ష్ణా నగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు తణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. ఆమె పుట్టింది మాత్రమే భారత్లో పెరిగింది,చదివింది అమెరికాలోనే. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా పార్లమెంట్లో ఆమె ప్రసంగానికి అధికార బీజేపీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమెపై ప్రశంసలు గుప్పించారు.
2016లో తణమూల్ ప్రధాన కార్యదర్శిగా మొయిత్రా ఉన్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేశారు. ఆ అనుభవంతోనే లోక్సభలో తొలిసారిగా మాట్లాడిన ఆమె ఎక్కడా సొంత పార్టీ గొప్పతనం గురించి గానీ అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం గానీ చేయలేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఏడు సమస్యల గురించి చట్టసభలో లేవనెత్తారు. దేశంలో నిరంకుశ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ ప్రసంగం ప్రారంభించిన మహువా దేశాన్ని విభజించాలనే కోరిక,మానవ హక్కులను కాలరాయడం,మీడియా స్వేచ్ఛను హరించడం, భయానక వాతావరణాన్ని సష్టించడం, పౌరసత్వ వివాదం, కళలను, మేధావులను అణచి వేయడం, ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోతుండటం వంటి సమస్యలను లేవనెత్తారు.
అమె ప్రసంగాన్ని మధ్యలో కొందరు ఎంపీలు అడ్డుకోవాలని చూసినప్పటికీ..వారిని వారించకుండా నేరుగా స్పీకర్తోనే మాట్లాడారు. ఇది గొప్ప ఆలయం..అల్లర్లు స ష్టించే అడ్డా కాదు అంటూ తనను అడ్డుకుంటున్న వారిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది వీక్గా మారింది మహువా. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈమె అత్యంత సన్నిహితురాలైన మహువా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కష్ణానగర్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ చౌబేపై 63,218 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది. చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే దేశమే బాగుపడుతుంది అనడానికి మహువా మొయిత్రా నిలువెత్తు నిదర్శనం.
ఉన్నత శిఖరాలు వదులుకొని…
ఆమె బాల్యమంతా అసోం, కోల్కతాల్లోనే గడిచింది. పదహారేళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లారు. మసాచుసెట్స్లోని మౌంట్ హోల్యోక్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం చదివారు. తరువాత అమెరికా, లండన్లో బ్యాంకర్గా పనిచేశారు. లండన్లో ఇన్వెస్టమెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెపి మోర్గాన్కు ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో చేరాలని భావించి 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగాల్కు తిరిగొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేశారు. బెంగాల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదనే విషయం కొన్ని రోజులకే మొయిత్రాకు అర్థమైంది. దాంతో 2010లో త ణమూల్ కాంగ్రెసలో చేరారు. అయితే చట్ట సభలలో ప్రవేశం మాత్రం మొయిత్రాకు అంత సులభంగా దక్కలేదు. 2016లో తొలిసారి ఆమెకు శాసన సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించింది. కరీమ్పూర్ నుంచి త ణమూల్ అభ్యర్థిగా మొయిత్రా పేరును ప్రకటించగానే మీడియా మొత్తం ఆమెకు వ్యతిరేకంగా మారింది. ‘ఆనంద బజార్’ పత్రిక అయితే ‘పెద్ద పెద్ద చలవకళ్లద్దాలు ధరించే దొరసానికి బెంగాలీ మాట్లాడ టమూ రాదు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఆ ఎన్నికలలో నదియా జిల్లాలోని కరీమ్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె శాసనసభకు పోటీచేసి గెలిచారు. తన పనితీరుతో నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకున్నారు. మూడేళ్లు తిరిగేసరికి ‘ఆనందబజార్’ పత్రిక తన అభిప్రాయాన్ని మార్చుకొని ఎమ్మెల్యేగా మొయిత్రా పనితీరును అభినందిస్తూ, పొగడ్తలతో ముంచెత్తింది.
అర్నబ్ జాగ్రత్త!
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఒక మీటింగులో ప్రసంగిస్తుండగా మధ్యలో వేదికపైకి ఎక్కిన ఒక వ్యక్తి చెంపదెబ్బకొట్టాడు. దాంతో త ణమూల్ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. తీవ్రగాయాలతో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న అతనిపైన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అప్పట్లో పెద్ద దుమారం రేగిన ఈ ఘటనపై ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ‘టైమ్స్ నౌ’ చానెల్ ‘న్యూస్ హవర్’ కార్యక్రమంలో మొయిత్రా పాల్గొన్నారు. ఆమె చెప్పే విషయం పూర్తికాకుండానే, మాటిమాటికీ మధ్యలో అర్నబ్ అడ్డుపడుతున్నాడు. ”నేను చెప్పడం పూర్తయ్యాక మీరు బదులివ్వండి” అని మోయిత్రా ఎన్నిసార్లు చెప్పినా అర్నబ్లో మార్పు లేదు. ”ఎవరినీ నీ షోకు పిలవకుండా, నువ్వొక్కడివే నీతో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా?” అని అంటున్నా వినిపించుకోలేదు. దాంతో అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న మొయిత్రాలో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ”దిస్ ఈజ్ వన్ మ్యాన్ షో” అంటూ కుడిచేతి మధ్య వేలును చూపించారు. షో అయితే ఆగలేదు, కానీ అర్నబ్నే హెచ్చరించిన ఆమె ధైర్యానికి అందరూ అవాక్కయారు. ఇన్నేళ్లలో అర్నబ్ తన షోలో రాజకీయ నాయకులను ఎంత విసిగించినా ఇంతవరకూ ఏ నాయకుడూ చేయలేని పని మహిళ అయినా మొయిత్రా చేయగలిగిందని ప్రశంసించారు.
మోదీకి వ్యతిరేకంగా నిలిచి గెలిచి …
సామాజిక సమస్యలపై చురుగ్గా స్పందించే గుణం మొయిత్రా సొంతం. తరచుగా ఆమె టీవీ చర్చాకార్యక్రమాల్లో పాల్గొని పలు సమస్యలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. మోదీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా పౌరులపై నిఘా పెట్టాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో పోరాటం చేశారు.
ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లను వాడుతున్న యూజర్లపై నిఘా పెట్టేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదన సోషల్ మీడియా హబ్. కానీ సోషల్ మీడియా హబ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్పై కన్నేసిందంటూ గతేడాది మొయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సోషల్ మీడియా హబ్ తీసుకురావాలనే కేంద్రం నిర్ణయంపైన ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అది పౌరుల హక్కులను కాలరాయడమే అని మొయిత్రా కోర్టుకు నివేదించారు.
‘ప్రజల వాట్సాప్, ట్విట్టర్ సందేశాలపై నిఘా పెట్టాలనుకుంటున్నారా? దీనివల్ల ప్రభుత్వ నిఘాలో ఉండే రాజ్యం ఏర్పడుతుంది’ అని బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం కోర్టుకి తెలిపింది. అలా మొయిత్రా పోరాటంతో చివరకు మోదీ ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకుంది. అయితే అంతవరకూ మొయిత్రా గురించి పశ్చిమ బెంగాల్ బయట ఉన్న జనాలకు పెద్దగా తెలియదు. ఆధార్ అనుసంధానం, సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పైన చేసిన పోరాటం ద్వారా ఆమె దేశం ద ష్టిని ఆకర్షించారు.
అవకాశాలే ఆమెను వెతుక్కుంటూ…
మొయిత్రా సత్తాను గుర్తించిన మమతా బెనర్జీ ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చే సే బాధ్యతను ఆమె భుజాలపై మోపారు. ఆ నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకుంటున్నారు. అందుకే క ష్ణానగర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ త పస్ పాల్ను తప్పించి మరీ దీదీ మొయిత్రాను లోక్సభ బరిలో నిలిపారు. ”జీవితం చాలా విచిత్ర మైనది. ఈ స్థానం నుంచే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్, త ణమూల్ పొత్తులో భాగంగా చివరి నిమిషంలో అవకాశం చేజారింది. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చింది” అంటూ ఆనాటి జ్ఞాపకాలను మొయిత్రా గుర్తుచేసుకుంటున్నారు.
‘వెర్వ్’ కోల్కతా గర్ల్
ఇండియాకు చెందిన లగ్జరీ అండ్ లైఫ్స్టైల్ మ్యాగజీన్ ‘వెర్వ్’ 2014లో కోల్కతా స్టైలిష్ ఉమన్గా మొయిత్రాను ప్రకటించింది. ‘మోయిత్రా ఎప్పుడూ కాటన్ చీరలోనే కనిపిస్తారు. స్టైలిష్ ఉమన్, ఆకర్షణ గల నేత’ అని ఆమెను ప్రశంసించింది.
ఆమె చెప్పినట్టే ఆధార్ అనుసంధానం
ఆ తర్వాత మరోసారి ఆమె కేంద్రం మెడలు వంచారు. బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తూ మొయిత్రా వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా సంచలనం కలిగించింది. ఆఖరికి ఆధార్ విషయంలో కేంద్రం వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. బ్యాంకు ఖాతాలకు, మొబైల్ సిమ్కార్డులకు, పాఠశాల దరఖాస్తులకు ఆధార్ అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వం దిగొచ్చి మొయిత్రా సూచించిన సంస్కరణలకు అంగీకరించింది. కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా పది దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ గతేడాది డిసెంబర్లో కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరోసారి కోర్టు గుమ్మం తొక్కారు. అది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే అని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి బలవంతుడు అని తెలిసినా వెరవకుండా, వెన్ను చూపకుండా పోరాడగలిగే గుణం అతి కొద్దిమందికే ఉంటుంది. వారిలో మహువా మొయిత్రా ఒకరు.