‘గులాబీ’లో గుబులు

టీఆర్‌ఎస్‌లో చాపకింద నీరులా బయటకొస్తున్న అసంతృప్త గళం

  • -మంత్రిపదవులు రాకపోవడంతో ఆవేదన
  • -సీఎం అన్యాయం చేశారంటున్న నాయిని
  • -అసమ్మతి స్వరం వినిపిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం
  • -పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి
  • -ఆరికెపూడి గాంధీ, కడియం, సండ్ర మరికొందరు నేతలు
  • -17న హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ బహిరంగ సభ
  • -అమిత్‌షా సమక్షంలో తీర్థం పుచ్చుకోనున్న అసమ్మతి నేతలు
  • -మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టనున్న బీజేపీ
  • -టీఆర్‌ఎస్‌ అస్మదీయులకు బీజేపీ గేలం
  • -బాహాటంగా పత్రికలకు ఎక్కొద్దంటున్న సన్నిహితులు

హైదరాబాద్‌:
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అనంతరం అధికార టీఆర్‌ఎస్‌లో అసంతప్తి గళాలు అధికమవుతున్నాయి. ఇప్పటికే మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యలు మంత్రివర్గ తీరుపై అసంత ప్తి వ్యక్తం చేయగా, ఇక తాజాగా మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా అసంతప్తితో రగిలిపోతున్న ట్లు తెలుస్తోంది. తాజా మంత్రివర్గ విస్తరణలో తనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పిస్తారని భావించిన మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యమంత్రి తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల అసంత ప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా, మైనంపల్లి హనుమంతరావు వాటికి దూరంగా ఉండేందుకు బెంగుళూరు వెళ్లిపోయినట్లు సమాచారం. అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతప్తికి లోనైన ఆయన.. తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు. తన సామాజికవర్గంలో తానే ప్రముఖుడిని అయినా జూనియర్‌కు అవకాశం ఇచ్చారని సన్నిహితుల వద్ద గాంధీ తన అసంతప్తిని వెల్లగక్కారని సమాచారం. అయితే ఈ అసంత ప్త ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలా శాంతపరుస్తుందో వేచి చూడాల్సిందే మరి.
టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి అసెంబ్లీ టికెట్‌ ను ఆశించిగా , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కి కేటాయించారు . దీనితో అసంత ప్తి రగిలిపోయిన మైనంపల్లి . టీఆరెస్‌ లో చేరి ఆ పార్టీ మల్కాజ్‌ గిరి లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేశారు . లోక్‌ సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన మైనంపల్లి కి, పార్టీ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
పార్టీ గ్రేటర్‌ అధ్యక్షునిగా నియమించడమే కాకుండా, ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కాదని మైనంపల్లి కి కేసీఆర్‌ టికెట్‌ కేటాయించారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి మంచి మెజార్టీతో విజయం సాధించారు. దాంతో తనకు మంత్రివర్గం లో స్థానం ఖాయమని, ఈ మేరకు కేసీఆర్‌ తనకు హామీ ఇచ్చారని సన్నిహితుల వద్ద మైనంపల్లి చెప్పినట్లు తెలుస్తోంది . కానీ విస్తరణలో తనకు అవకాశం లేకపోవడంతో అసంతప్తితో రగిలిపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఏదో చేసేస్తుందని అంతా ఊహించినా అందుకు భిన్నంగా కేసీఆర్‌ రెండోసారి భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. అలాంటి గెలుపు ఇచ్చిన అతి విశ్వాసమో – అహంకారమో కానీ కేసీఆర్‌ లోని నియంత పూర్తిస్థాయిలో నిద్రలేచారు. తాను తన అనుంగు మిత్రుడు మాత్రమే సీఎం – డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసి వేరెవ్వరినీ మంత్రివర్గంలోకి తీసుకోకుండా కొన్ని నెలల పాటు పాలన సాగించారు కేసీఆర్‌. అయినా… పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కానీ – సీనియర్‌ నేతలు కానీ దానిపై నోరు మెదపలేదు. మంత్రివర్గం లేకుండా పాలనేంటని ప్రశ్నించలేకపోయారు… కనీసం మంత్రి వర్గం ఏర్పాటుచేయండి సార్‌ అని సలహా కూడా ఇవ్వలేకపోయారు. ఆ తరువాత ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో మహిళలు లేరన్న విమర్శకు తెరదించే ప్రయత్నం చేయలేదాయన.. అయినా – పార్టీలోని మహిళా నేతలు కిమ్మనలేదు.
అంతేకాదు.. హరీశ్‌ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు… ఆయన గత ప్రభుత్వంలో నీటి పారుదల మంత్రిగా పనిచేసి రాత్రీ పగలు తేడాలేకుండా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినా దాని ప్రారంభోత్సవంలో కానీ – ఆ తరువాత కానీ హరీశ్‌ పేరు వినపడకుండా చేశారు. అయినా దానిపైనా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. సెక్రటేరియట్‌ కు వెళ్లకుండా ఫాం హౌస్‌ లోనే కూర్చుని కథ నడిపిస్తున్నా పార్టీ నేతలెవరూ ఇది కరెక్టు కాదు సార్‌ – చెడ్డ పేరొస్తోందని చెప్పే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన 8 నెలల తరువాత ఒక్కసారిగా అసంతప్తి బట్టబయలైంది. నిరసన గళాలు నిమిష నిమిషానికీ పెరుగుతున్నాయి. ఇంతలోనే ఎందుకింత మార్పు… ? దీనికి కారణాలేమిటి? కేసీఆర్‌ స్వయంకతాపరాధమా.. లేదంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ కల్పిస్తున్న భరోసాయా? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.. కేసీఆర్‌ శకం ముగిసినట్లేనా? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్‌ తాజాగా కేబినెట్‌ విస్తరణ చేపట్టిన తరువాత సోమవారం నుంచి జరుగుతున్న పరిణామాలు… ఒక్కరొక్కరుగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా బాహాటంగా నిరసన గళం వినిపించడం ఆ పార్టీ నేతలను – కేసీఆర్‌ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అసంతప్తి ఉందని ఈసరికే కేసీఆర్‌కు అర్థమైనా ‘నన్నడిగేవాడెవ్వడు’.. ‘నన్ను కాదని పోయేవాడెవ్వడు’ అన్నట్లుగా ఉండేది ఆయన వ్యవహారం. కానీ.. ఇప్పుడలాగే వ్యవహరిస్తే ఇక కుదరదన్న సంగతి ఈసరికే ఆయనకు అర్థమై ఉండాలి. సోమవారం కేసీఆర్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించిన తరువాత కేబినెట్లోకి తీసుకున్న నేతలను చూసి ఆది నుంచి టీఆరెస్‌ లో ఉన్న నేతలు మండిపడుతున్నారు. నాయిని నరసింహారెడ్డి – జోగు రామన్న బాహాటంగా విమర్శించారు. కేసీఆర్‌ మోసం చేశారని నాయిని ఆరోపించగా.. జోగు రామన్న తన సెక్యూరిటీని వెనక్కు పంపించేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వీరేకాదు.. మాదిగలకు అవకాశమివ్వలేదంటూ ఆ వర్గానికి చెందినవారూ మండిపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య – కడియం శ్రీహరిలు కూడా కేసీఆర్‌ తీరుపై రగిలిపోతున్నారు. తలసాని – ఎర్రబెల్లి దయాకరరావు – సత్యవతి రాథోడ్‌ – సబితా ఇంద్రారెడ్డి – చామకూర మల్లారెడ్డి – గంగుల కమలాకర్‌.. ఇలా అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే కేసీఆర్‌ మంత్రులుగా తీసుకున్నారు కానీ పార్టీని ఆది నుంచి నమ్ముకున్నవారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
టీఆరెస్‌లో అసంతప్తి ఇవ్వాల్టికి ఇవ్వాళ పుట్టిందేమీ కాదు.. ఇంతకాలం అది నివురుగప్పిన నిప్పులా ఉండి సమయానుకూలంగా బయటకొస్తోంది. నిన్నటి నుంచి గళం విప్పుతున్నవారి కంటే ముందే సీనియర్‌ నేత ఈటెల ఇటీవల కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేసి పిల్లి మెడలో గంట కట్టారు. ఆయన గంట కట్టిన తరువాత రసమయి బాలకిషన్‌.. ఇప్పుడు మిగతా వారంతా ఈటెల ఇచ్చిన ధైర్యంతో కేసీఆర్‌ తీరును ఎండగడుతున్నారు. కేసీఆర్‌ మెడలో గంట కట్టిన ఈటెల చేతి నుంచి కీలకమైన ఆర్థిక శాఖను తప్పించడం తప్ప కేసీఆర్‌ ఆయన్ను ఏమీ చేయలేకపోయారు.
కేసీఆర్‌ పై అసంతప్తి ఇంతగా బయటపడడానికి కారణం ఆయన స్వయంకతాపరాధం ఒకటైతే.. రెండోది బీజేపీ బలపడి దూసుకెళ్తుండడం. 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిని ఉన్న సీట్లు కూడా కోల్పోయి ఒక్క స్థానానికే పరిమితం కావడంతో కేసీఆర్‌ ఆ పార్టీని చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ అక్కడికి నాలుగు నెలల్లోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఏకంగా కేసీఆర్‌ కుమార్తె కవితనే ఓడించింది. తెలంగాణలో గుండెకాయలాంటి కరీంనగర్‌ ఎంపీ సీటును ఎత్తుకెళ్లింది. ఆ విజయాలను కొనసాగించాలన్న నిశ్చయంతో బీజేపీ దూకుడు నిర్ణయాలు తీసుకుంది. కిషన్‌ రెడ్డిని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని చేసింది. ఆ దెబ్బకు కేసీఆర్‌ గుండెల్లో రాయి పడింది. టీఆరెస్‌ లోని కేసీఆర్‌ వ్యతిరేకులు – తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారికి బీజేపీ ఆశాకిరణంలా కనిపించింది.
తాజాగా.. బండారు దత్తాత్రేయను గవర్నరు చేయడం.. తెలంగాణ గవర్నరును మార్చి తమిళనాడు బీజేపీ నేతను తెచ్చిపెట్టడంతో పాటు తెలంగాణలో విస్తరణకు గేట్లు ఎత్తి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను తీసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో టీఆరెస్లోని కేసీఆర్‌ వ్యతిరేకులు అటు చూస్తున్నారు. ఇప్పటికే వివేక్‌ బీజేపీలో చేరారు. ఆయన కూడా తన వర్గానికి చెందిన నేతలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో గులాబీ బాస్‌కు గులాంగిరీ చేయడం కంటే బీజేపీలో చేరి గౌరవంగా రాజకీయాలు చేయడం.. కుదిరితే పదవులు సంపాదించుకోవడం నయమన్న ఉద్దేశానికి టీఆరెస్‌ లోని చాలామంది సీనియర్లు ఇప్పటికే వచ్చారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఒక్కరొక్కరుగా కేసీఆర్‌ పై నిరసన గళం విప్పుతున్నారని టాక్‌. అసంత ప్తి పాతదే అయినా కొత్తగా బలం రావడంతో అది బయటపడుతోందని తెలుస్తోంది. దీన్ని బీజేపీ నూటికి నూరు శాతం ఉపయోగించుకోలిగితే తెలంగాణలో కేసీఆర్‌ శకం ముగియడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.