అవినీతిని బయట పెడతాం: బండి సంజయ్
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
టీఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని,వాటిపై కూడా విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ•••• డిమాండ్ చేశారు. కక్షపూరితంగానే ఈటల రాజేందర్పై విచారణ జరిపించారని ఆరోపించారు.శనివారం సాయంత్రం నగరంలోని బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ మంత్రులపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయో వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే ప్రభుత్వంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. వాటికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు.ఏ శాఖలో ఎక్కువ డబ్బులు ఉంటే ఆ శాఖను సీఎం తీసుకుంటారని ఆరోపించారు.గతంలో నీటిపారుదల శాఖ, ఇప్పుడు వైద్యారోగ్య శాఖను తనకు బదిలీ చేయించుకున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారన్నారు.హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి 421 ఎకరాల భూమిని కబ్జాచేసి గిరిజనులపై దాడులు చేయించారని, ఇది సీఎంకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పిన మున్సిపల్ కమిషనర్ను బెదిరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా ఇల్లే కట్టుకున్నారని ఆరోపించారు. బొమ్మల రామారం, రాజాపేట మండలాల్లో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకున్నారని, టిఆర్ఎస్కు
చెందిన దాదాపు 77 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, వారిపై వెంటనే యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపించాలని, టీఆర్ఎస్ నేతల పూర్తి చిట్టాను బయటకు తీస్తున్నామని, ఒక్కొక్కటిగా బయట పెడతామని బండి సంజయ్ హెచ్చరించారు.