నూతన కార్యాలయం ప్రారంభించిన కలెక్టర కృష్ణ ఆదిత్య
ములుగు ప్రతినిధి జ్యోతి న్యూస్
ములుగు, ఆగస్ట్ 28 : కలెక్టరేట్ లో నిర్వహించబడుచున్న రెవిన్యూ డివిజనల్
అధికారి కార్యాలయాన్ని కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సహకార అధికారి కార్యాలయ
భవనంలోకి మార్చగా, శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు
కలెక్టర్ (స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభించారు. పూజల
అనంతరం ఆర్డీవో కె. రమాదేవి నూతనంగా ఏర్పాటుచేసిన చాంబర్ లో ప్రవేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డి.ఏ.ఓ.
వీరభద్రప్రసాద్, కలెక్టరేట్ ఏ.ఓ. శ్యామ్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్
రాజ్ ప్రకాష్, పేషీ సూపరింటెండెంట్ రాజునాయక్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.