కరోనాలో సరికొత్త కోణం

14 రోజుల్లో బయటపడుతున్న సరికొత్త లక్షణాలు…వెల్లడించిన సీడీసీ భారత్ లో కొనసాగుతున్న ఉధృతి

న్యూఢిల్లీ: కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరు వచ్చి చేరాయి. అమెరికాలోని సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వీటిని జోడించింది. ఇప్పటిదాకా ఉన్న జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలకు తోడుగా… ఇప్పుడు రుచి, వాసనలకు గ్రహించలేకపోవడం, చలి పుట్టడం, చలితో వచ్చే వణుకుడు, తలనొప్పి, గొంతులో మంట, కండరాల నొప్పి వంటి ఇబ్బందులు కనిపించినా కరోనా సోకినట్లు అనుమానించాల్సిందేనని సీడీసీ చెప్పింది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడవచ్చునని తెలిపింది. ఛాతీలో విడవకుండా నొప్పి వస్తున్నా, గందరగోళంగా అనిపిస్తున్నా, పెదవులు కానీ, ముఖం కానీ నీలి రంగులోకి మారుతున్నా జాగ్రత్త పడాలని సీడీసీ హెచ్చరించింది. జాబితాలో పేర్కొన్న లక్షణాలే కాకుండా ఇతరత్రా మరేవైనా తీవ్ర ఇబ్బందులుంటే వైద్యులను సంప్రదించాలంది. భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 62 మరణాలు సంభవించడంతోపాటు కొత్తగా 1543 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 934మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 6869 మంది కోలుకోగా మరో 21,632 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 23.33గా ఉండటం ఊరటకలిగిస్తోంది. మహారాష్ట్రలో 369 మరణాలు.. దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 522కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8590 పాజిటివ్ కేసులు నమోదుకాగా 369మంది మ ృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్ పూర్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్ లో చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3548కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 162మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోనూ కొవిడ్ ఉద్ద అతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2168 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 110మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3108 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో 1183, తెలంగాణలో 1004 కేసులు.. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 1171 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఇప్పటివరకు 235 మంది కోలుకున్నారు. తెలంగాణలో మె ఎత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1004కి చేరగా 26మంది మరణించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 321మంది కోలుకున్నారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గండంతో పాటు గత రెండు రోజులుగా మరణాలు నమోదుకాకపోవడం ఊరటనిస్తోంది. రోజుకు లక్ష టెస్టులు చేయిస్తాం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ భరోసా న్యూఢిల్లీ: రోజుకు లక్ష కరోనా టెస్టులు నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మే ఆఖరు నాటికి యాంటీ బాడీ టెస్ట్ కిట్స్ తో పాటు ఆర్టీ- పీసీఆర్(రివర్స్ ట్రాన్స్ స్క్రిప్షన్ పాలిమరైజ్ చెట్కన్ రియాక్షన్) కిట్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం భారత్ కు పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి అన్నీ అడ్వాన్స్ దశలో ఉన్నాయని, ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్) అప్రూవల్ రాగానే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. అనుమతి రాగానే మే 31 నాటికి రోజుకు లక్ష టెస్టులు చేయగలుగుతామని చెప్పారు. మంత్రి ఇవాళ డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు చెప్పారు. రెండు వారాల క్రితం భారత్ లో కరోనా కేసుల రెట్టింపునకు 8.7 రోజులు పడుతుండగా గత వారంలో 10.2 రోజులు పట్టిందని హ వర్ధన్ తెలిపారు. గత మూడు రోజుల్లో కేసుల రెట్టింపునకు 10.9 రోజులు పట్టిందని చెప్పారు. దేశంలో 300 జిల్లాలు నాన్ హాట్ స్పాట్ గా ఉన్నాయని, 129 జిల్లాల్లో 50కి పైగా కరోనా కేసులున్నాయని హర్ష వర్ధన్ చెప్పారు. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకూ 934 మంది చనిపోయారు. 6,869 మంది కోలుకున్నారు.