కరోనా దెబ్బకు కర్షక మహర్షులు వస్తున్నారు!

ఇక మహర్దశలో వ్యవసాయం .విదేశీ కొలువులకు తిలోదకం

  • వ్యవసాయం మీద దృష్టి పెడుతున్న యువత
  • కొలువులన్నీ కొట్టుకుపోయినా చేయూతనిచ్చే పుడమితల్లి
  • వ్యవసాయం దండగ అనేవాళ్లకి పండగని తెలిసొచ్చే రోజు వస్తోంది
  • చదువుకున్న రైతులను ఇక పై చూడబోతున్నాం
  • ఇప్పటికే తమిళనాడులో రైతులకు జీతాలిస్తున్న ఓ సంస్థ
  • రైతులతో పనిచేయించుకుంటున్న కీర్తికడై డాట్ కామ్
  • ఒక్కో రైతుకు 20 వేల వేతనం, ఇతర భత్యాలు
  • అదే బాటలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో.. 

హైదరాబాద్: నేల తల్లి ప్రకృతిలో ఓ అనశ్వర సాధనం. ఎండలకు, వానలకు తట్టుకుంటుంది. ఎంత పెద్ద ప్రకృతి విపత్తులనైనా భరిస్తుంది. వరద వచ్చి భూమి తల్లిని నిండా ముంచేసి వెళ్లినా మళ్లీ గతం కన్నా ఎక్కువ సారాన్ని ఇముడ్చుకుని మరిన్ని పంటల దిగుబడిని ఇస్తుంది. మనిషి సృష్టించిన వన్నీ కాలక్రమంలో కనుమరుగవుతున్నా..ఎన్ని వేల సంవత్సరాలయినా చెక్కుచెదరక..తన గుణాన్ని , సహజ సిద్ధ స్వభావాన్ని చాటుకునే ఏకైక పుడమి తల్లి మన మట్టి భూమి. అలాంటి భూమిని ఇన్నాళ్లూ అమ్ముకున్నాం. వాణిజ్య పుర వీధుల్లో తిప్పాం. ఒక వ్యాపార వస్తువుగా మలుచుకున్నాం. కోట్లు కూడగట్టుకున్నాం..సర్వ సౌఖ్యాలు సమకూర్చుకున్నాం… ఇప్పుడు ఒక్కసారిగా కరోనా దెబ్బకు కోట్లాది సౌధాలే కుప్పకూలే రోజు వచ్చింది. డబ్బు పెట్టినా దొరకనిది ఆకలి అని ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చింది. మరి ఆ ఆకలి తీర్చే అన్నదాత కూడా భూమిమీద అలిగివుంటే ఇప్పుడు మనం ఈ మాత్రం తినడానికి కూడా ఏమీ మిగిలివుండేది కాదు. అందుకే ముఖ్యంగా భారతదేశపు యువత ఈ కరోనా దెబ్బతో ఒక్కసారిగా కళ్లు తెరిచారు. విదేశాలకెళ్లి వైరస్ అంటించుకునేకన్నా.. స్వదేశంలో ఉండి వ్యవసాయాన్ని నమ్ముకోవడమే చాలు అనుకుంటున్నారు. ఒకప్పుడు 70 శాతం మంది భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడ్డారంటే అంతా బాధపడ్డాం. ఆ విలువ ఇప్పుడు మళ్లీ తెలిసొచ్చేలా చేసింది కరోనా మహమ్మారి. ‘మాకూ ఏదయినా ఉద్యోగం ఉంటే బాగుండు”అని చాలా మంది రైతులంటుంటారు. అలాంటి రైతుల కోసమే ఇప్పడో కం పెనీ వచ్చింది. ఈ కం పెనీలో పనికి పెద్ద చదువులు అక్కర్లేదు. వ్యవసాయం తెలిస్తే చాలు. విత్తనాలు చల్లడం, నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, ఎరువు చల్లడం తెలిస్తే చాలు నెలకు ఇరవై వేలు జీతం! మన ఊళ్లోనే ఉంటూ మన చేలోనే పనిచేసుకునే కొలువు ఇది. రైతుకి ఉద్యోగం ఇచ్చే ఆ కంపెనీ పేరు కీరైక డై డాట్ కామ్. తమిళనాడులోని కోయంబత్తూరుకు దగ్గర్లో ఉన్న ఊళ్లలో రైతులకు ఉద్యోగాలిస్తోంది ఆ కం పెనీ. అంతేకాదు పంటకు పెట్టుబడి, పండించిన పంటకు కమీషన్ కూడా ఇస్తోంది! సారవంతమైన భూములున్నయి. పుష్కలంగా నీళ్లున్నాయి.పంటలు పండించే సత్తువా ఉంది. కానీ వ్యవసాయం దండగని రైతు కాడెత్తేశాడు. పండిన పంటకు గిట్టుబాటు కావట్లేదనేది రైతుల గోస.కూరగాయలు కొనలేకపోతున్నమని కొనేటోళ్ల బాధ. కూరగాయలు ఇంత రేటు పెట్టి కొన్నా రైతులు లాభం లేదంటారే? అన్న సందేహం చాలా మందిది. సమాధానం తెలియంది కాదు. మార్కెట్లో మనం ఖర్చు పెట్టే డబ్బులో ఎక్కువ మొత్తం వ్యాపారుల జేబుల్లోకే చేరుతుంది. వ్యాపారుల లాభాల కోసమే వ్యవసాయం చేయాలా? అని ఆర్థికంగా వ్యవసాయం వదిలి పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టారు. పేద రైతులు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారుతున్నారు. బాగున్నోళ్లు ఊరు దాటలేక, వేరే దారిలేక ఇప్పటికీ వ్యవసాయంలో అదృష్టం పరీక్షించుకునే వాళ్లు ఇంకా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి రైతుల కోసమే పనిచేస్తోంది కీర్తికడై డాట్ కామ్. రైతుల భూముల్ని ఆ సంస్లే కౌలుకు తీసుకుంటుంది. ఆ రైతునే ఉద్యోగిగా నియమించుకుంటుంది. కూరల సాగుకి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, మెయింటెనెన్స్ ఖర్చులిస్తుంది. పంటను కంటికి రెప్పలా కాచుకున్నందుకు ఆ రైతుకు నెలనెలా జీతమిస్తుంది. పంట చేతికి వచ్చాక రైతుకు ఇన్సెంటివ్ లాగా లాభంలో కొంత మొత్తం ఇస్తుంది. దేశమంతా వ్యవసాయం దండుగ’ అంటున్న రోజుల్లో ‘వ్యవసాయం పండుగ’ అనుకుంటున్నారు కోయంబత్తూరు చుట్టుపక్కల గ్రామాల రైతులు! ఆరోగ్యం, సేంద్రీయ వ్యవసాయంపట్ల అవగాహన పెరగడంతో కోయంబత్తూరు ప్రజలు కీరై కడై పండించే కూరలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లుగా నేరుగా ఇంటింటికీ చేరవేసేందుకు ఆన్లైన్ ఆర్డర్స్ ని కూడా స్వీకరించడం మొదలు పెట్టారు. ఈ కామర్స్ కోసం 2017లో ఓ వెబ్ సైట్ ప్రారంభించారు. మొబైల్ ఆర్డర్స్ కోసం ఓ యాప్ ని రూపొందించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఈ యాప్ ని ఉ పయోగించుకోవచ్చు. ఈ రైతు పండించిన పంట నేరుగా రోజుకు నాలుగు వేల కుటుంబాలకు చేరుతుంది. ఈ యాప్ ద్వారా నలభై రకాల ఆకుకూరల్ని కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. కీరైకడై బి డాట్ బికామ్ అనేది ఒక ఈ కామర్స్ కంపెనీ. దీనిని శ్రీరామ్ ప్రసాద్ అనే ఒక టెకీ ప్రారంభించాడు. డాట్ కామ్ ఇన్పోవే అనే కంపెనీలో క్లయింట్ రిలేషన్స్ స్పెషలిస్ట్ గా పనిచేసిన ఆయన పలు దేశాలకు చెందిన ఈ కామర్స్ సంస్థల కోసం వెబ్ సైట్లు రూపొందించాడు. పదేళ్ల అనుభవం తర్వాత ఆ ఉద్యోగం మానేశాడు. మధురై ప్రాంతా నికి చెందిన శ్రీరామ్ ప్రసాద్ వ్యవసాయ కుటుంబ నేపథ్యం. ‘ఆహారమే ఔషధం’ అని వినడమే కానీ, అది నిజం కాదని తెలిసిన వాడు కూడా. నాలాల పక్కన పెంచే ఆకు కూరలతో వచ్చే రోగాలేమిటో అతడికి తెలుసు. పురుగు మందుల ప్రమాదం పట్ల అవగాహన ఉన్నవాడు. ఆహారం ఔషధంలా పని చేయడం ఏమోగానీ రోగాలు రాకుండా ఉంటే నయం అనుకున్నాడు. రైతులు సంప్రదాయ పద్ధతిలో పండిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ ఊళ్లలో రైతుల సమస్యలు వేరేగా ఉన్నాయి. ‘నమ్మళ్వార్ సేంద్రీయ వ్యవసాయం’ ఆయన్ని ఆకర్షిం చింది. ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అనుకున్నాడు. తమిళనాడు వ్యవసాయ . విశ్వవిద్యాలయంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ పొందాడు. ఆ తర్వాత తన సోదరుడు శ్రీరామ్ సుబ్రహ్మణ్యంతో కలిసి 2015లో వినూత్న రీతిలో ఆన్లైన్ వ్యాపారంలో దిగాడు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడానికి అధిక పెట్టుబడి, ధరలు లేకపోవడం, నకిలీలే కాదు వైజ్ఞానిక విషయాలపట్ల అవగాహన లేకపోవడం కూడా కారణాలే. మన రైతులకు పంటను సాగు చేసే పద్ధతులపై అవగాహన ఉంటుంది. కానీ ఆపంటను సాగుచేసే భూమిని అర్థం చేసుకునే అవగాహన లేదు. భూమిలో ఖనిజ మూలకాల ధాతువుల) లోపాల వల్ల కూడా చేలు తెగుళ్లను ఎదుర్కొంటాయి. తక్కువ ఫలసాయం వస్తుంది.ధాతువుల లోపాన్ని నివారించేందుకు సరైన పద్దతులను ఆచరిం చాలి. అలాగే భూమిలో ఉండే ధాతువులకు అనుగుణంగా పంట రకాలను ఎంచుకో వాలి. ఈ విషయాలపట్ల అవగాహన లేని రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు శ్రీరామ్ ఎ ప్రసాద్ భూసార పరీక్షలు చేయించాడు. దానికి అనుగుణంగా పంటల ఎంపిక, ఎరువుల వాడకాన్ని పాటించారు. ఈ విధానం వల్ల దిగుబడి పెరగడంతో వ్యవ సాయం లాభసాటిగా మారింది. రైతులకు సొంతంగా మార్కెటింగ్ లేకపోవడంతో ఉండే సమస్యలేమిటో గుర్తించిన శ్రీరామ్ ప్రసాద్ అందరి కోసం ఓ మార్కెటింగ్ వ్యవ స్థను నిర్వహిస్తున్నాడు. ఈ విధానం స్థానిక య ఎవతను ఆకట్టుకుంది. వ్యవసాయం చేసేందుకు ఆయా గ్రామాల్లోని రైతు బిడ్డలు ఆసక్తి చూపుతున్నారు. రైతు కొలువుల్లో చేరుతున్నారు. ఉన్న ఊళ్లోనే ఉంటూ, సొంత భూమిలో సాగు చేస్తూ నష్టాలు లేని వ్యవసాయం చేయాలనుకునే రైతులు తమతో కలిసి పని చేయాలని శ్రీరామ్ ప్రసాద్ కోయంబత్తూ రు నగరానికి సమీపంలో ఉన్న రైతుల్ని సంప్రదించాడు. తాము మార్కెటింగ్ చేస్తు న్న పాలకూర, ఆకుకూరలను డిమాండ్ కు తగినట్లుగా పండించేందుకు రైతులతో అవగాహన కుదుర్చుకున్నారు. కీర్తి కడై కం పెనీ రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకుని పంటకు పెట్టుబడి సమకూర్చి, రైతులను నెల వారీ వేతనానికి ఉద్యోగులు గా నియమించుకుని వ్యవసాయం మొద లు పెట్టింది. కొంత మంది రైతు ఉద్యోగు లుగా ఉంటే మరికొంత మంది ఈ సంస్థ సాయంతో దాని నియమాల ప్రకారం వ్యవసాయం చేసి లాభాలు అందుకున్నా రు. నెలకు 15 వేల నుంచి 20 వేల మధ్య ఈ కంపెనీ రైతు ఉ ద్యోగులకు వేతనాలుగా ఇస్తోంది. రైతులు పండించిన పంటకు తగినట్లుగా ఆ తర్వాత లాభాల్లో కొంత వాటాను కూడా ఇస్తుంది. ఈ వ్యవసాయ విధానంలో రైతులు పెట్టుబడికి డబ్బులు లేక అప్పుల పాలవటం లేదు. గిట్టుబాటు ధరలేక నష్టపోవడమూ లేదు. పండించిన పంటను నేరుగా పట్టణాల్లో అమ్మివచ్చిన మొత్తంలో రైతు నష్టపోకుండా లాభాలను కంపెనీ రైతులకు పంచుతోంది. విత్తనాలు, ఎరువులు, మెయింటెనెన్స్కు కావాల్సిన డబ్బులు కంపెనీ నుంచి తీసుకుని పంటకు కమిషన్ తీసుకునేందుకు చాలా మంది రైతులు ముందుకువచ్చారు. కోయం బత్తూరుకు సమీపంలోని ఇరుగూరు, సిత్రా, వీర్యంపలాయం, తొండముత్తూరు, థదాగమ్, తెలుంగపాల్యం, పొల్లాచి గ్రామాల్లో ఈ ప్రయోగంతో దశాబ్దం క్రితం వ్యవసాయం దండగ అన్న రైతులంతా ఇప్పుడు వ్యవసాయం పండుగ అంటున్నారు. ఆ ఊళ్లలో పండిన ఆకు కూరల్ని వ్యవసాయ క్షేత్రం నుంచి కోయంబత్తూరు కు తీసుకువచ్చి, వాటిని నగరంలోని సంస్థ నిర్వహించే షాపులకు, అపార్ట్ మెంట్ కాం ప్లెక్సకు వ్యాన్లలో సరఫరా చేస్తారు. విత్తనాలు పండితే చాలు. మళ్లీ వ్యవసాయం చేయాలంటారు రైతులు. నమ్మకం కుదిరితే చాలు, అదే నమ్మకాన్ని నిలబెట్టకోవాలను కుంటుంది కీరై కడై. నేటి రైతుల విజయా లను యువ రైతులు అందిపుచ్చుకోవాలం టోంది. యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించేందుకు కీరై కడై సంస్థ రెండంచెల విధానాన్ని ఎంచుకుంది. ఒకటి చదువుకున్న యువతను సేద్యంలోకి తీసు కురావడం. ఆయువ రైతులకు నెల వేతనం ఇచ్చి ఉపాధి కల్పించడం. ఇక రెండోది రేపటి తరాలను వ్యవసాయ రంగంలోకి ప్రోత్సహించడం. భారతదేశ చరిత్ర తరగతిల గదుల్లో రూపుదిద్దుకుంటుందంటారు. వ్య వసాయ భారతం కూడా తరగతి గదుల్లోనే రూపుదిద్దాలని పిల్లలకు సాగు పాఠాలు చెబుతున్నారు. కోయంబత్తూరులోని కీరై కడై స్టోరకు వచ్చే పిల్లలకు విత్తనాలు కానుకగా ఇచ్చే ఈ సంస్థ, పాఠశాలల్లో కూరగాయల సాగుని పిల్లలకు నేర్పిస్తుంది. స్థానిక పంటల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పిల్లలకు రైతు కష్టం తెలిసేలా, వ్యవసాయం పట్ల గౌరవం పెంచేలా చేస్తున్నారు. తెలివైన పిల్లల్ని వ్యసాయ రంగంలోకి ఆహ్వానించే పథకం ఇది. ప్రతి బడికీ పోయి మనం తినే అన్నం, తినే కూరలు, పండ్లు ఎలా పండుతు న్నాయో పిల్లలకు చక్కగా చెబుతున్నారు. రోబోటిక్స్, ఆటోమొబైల్స్ ప్రయోగాలకే పిల్లల్ని పరిమితం చేయకుండా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు వచ్చేలా విత్తనా లు నాటుతున్నారు. నాగవర్ధన్ రాయల చదళారీబి లేకుంటే బిదండగే బిలేదు పాలకూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి, గోంగూర, మెంతి, మునగాకు, కరివేపాకు మేం రోజూ అమ్ముతాం. వీటికి మార్కెట్లో బాగా గిరాకీ ఉంది. కానీ ఈ రైతులకు లాభాలు లేవు. భూమిని అర్థం చేసుకుంటే రైతుకు కష్టాలే రావు. మార్కెట్ ను అర్థం చేసుకుంటే నష్టాలే రావు. అది నేను అర్థం చేసుకునే ఈ వ్యాపారం మొదలు పెట్టాను. వ్యవసాయాన్ని మార్కెట్ కు అనుసం ధానించేందుకు టెక్నాలజీని వాడాను. ఇక దళారీల అవసరమే లేదు. కాబట్టి నష్టాలే రావు. ఈ విషయం రైతులకు అర్థం అయ్యేలా చేశాం. ఇక ఎక్కువ గ్రామాల రైతులకు ఉపాధి కల్పిస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.. అంటారు శ్రీరామ్ ప్రసాద్, కీర్తికడై సీఈఓ