సంక్షోభం నుంచి గట్టెక్కాలి

కరోనా కట్టడి పై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ 

  • ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోవాలి
  • కరోనా కట్టడి పై రాష్ట్రాల చర్యలు భేష్
  • ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేత జరిగితే
  • తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • జనాలు గుంపులుగా చేరకుండా చేయాలి
  • నిజాముద్దీన్ ఘటన చర్యలపై ప్రశంసలు
  • ఆహారం కొరత లేకుండా చూసుకోవాలి 

“కరోనా కట్టడికి రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయవం. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నెల 14వ తేదీతో లాక్ డౌన్ మ గియనున్న నేపథ్యంలో ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వ్యూహాలు ఆలోచించుకుని చర్యలు చేపట్టాలి. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థలకు కృతజ్ఞతలు ”   – నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి, లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ గురువారం జరిగింది. కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని అభినందించారు. లాక్ డౌన్ నుంచి బయటపడిన వెంటనే ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని చెప్పారు. కరోనా వైరస్ కట్టడి పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాలని పేర్కొన్నారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నారు. సంక్షోభం నుంచి బయటవడే అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలు ధార్మిక సంస్థల నేతలతో చర్చించాలన్నారు. రెండో దశలో వేగంగా విస్తరించే అవకాశం ఉంది : రెండో దశలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు, మెడికల్ కిట్లు సమకూర్చుకోవాలని తెలిపారు. దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్, ఎస్ఎస్ఎస్, ఆయుష్ డాక్టర్లను రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిధులు వస్తున్న నేపథ్యంలో బ్యాంకుల వద్ద గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైడ్ షేరింగ్ అప్లికేషన్ ద్వారా ధాన్యాలను సేకరించే అవకాశం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పంట కోతల సమయం కనుక రైతులకు కొన్ని మినహాయింపులతో వారు పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారిని గుంపులుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ‘లాక్ డౌన్ ఎత్తివేత’..హిందీ రాకనే ఈ తప్పిదం ఈ సందర్భంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ లను గుర్తించి వాటిని ఎన్ సర్కిల్ చేయాలన్నారు. హాట్ స్పాట్స్ గా ఏంచుకొన్న వాటి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ఉన్న వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విన్నవించారు. దీంతోపాటు ఆర్థిక వనరుల అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. భౌతిక దూరం ద్వారానే వైరస్ వ్యాప్తి కాకుండా చూడగలమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. నిజాముద్దీన్ మర్కజ్ ఘటన ద్వారా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలను హెూంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేత పై సీఎం చేసిన ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్ లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్ ను తొలగించారు. ఈ సందర్భంగా ఆ ట్వీట్ పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్ డౌనకు సంబంధించి ట్వీట్ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్ ను తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మా అధికారికి లాక్ డౌన్ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్ డౌన్లోనూ, ఆతర్వాత కూడా ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్ లు ధరించడం వంటివి కొనసాగించాలని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పలువురు ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభ చూపారని కొనియాడారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులను పసిగట్టడంతో పాటు కేసుల వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోలు, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని సీఎంలకు ప్రధాని సూచించారు. కొవిడ్-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. కరోనా పరిస్థితి పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది జమాత కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. బాధితులను క్వారంటైన్, ఐసోలేషన్ కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.