ప్రమాద ఘంటికలు

భారత్‌లో మూడో దశకు చేరువలో మహమ్మారి కరోనా!

200 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌
` షట్‌ డౌన్‌ దిశగా యావత్‌ భారత్‌
`ఇప్పటిదాకా విదేశీయులనుంచే సోకిన వైరస్‌
`ఇకపై సమూహాలపై తీవ్ర ప్రభావం
`భారత్‌కు కీలకంగా మారిన మూడో దశ
`కఠినచర్యలతోనే నియంత్రణ
`ప్రజా సహకారం మరింత అవశ్యం
`ప్రైవేటు ఆసుపత్రు, వైద్యుల అవసరం
`దేశమంతటా ఇక హెల్త్‌ ఎమర్జెన్సీ

హైదరాబాద్‌:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని దేశాు వణికిపోతున్నాయి. మొత్తం 195 దేశాకు వైరస్‌ వ్యాపించింది. ఇప్పటి వరకూ సుమారు 10 వే మందికి పైగా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. 2 క్ష మందికిపైగా వైరస్‌ సోకింది. అన్ని దేశాు కరోనాపై అప్రకటిత యుద్ధం ప్రకటించాయి. వైరస్‌ వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన చర్యు చేపట్టాయి. పుదేశాు సరిహద్దును మూసివేశాయి. విమానా రాకపోకను రద్దు చేశాయి. స్కూల్స్‌, యూనివర్శిటీు, బహిరంగసభపై ఆంక్షు విధించాయి. హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇప్పటికే రెండు దశకు చేరిన కరోనా వైరస్‌ భారత్‌లో మూడవ దశకు చేరుకుందా అనే అనుమానం ఇప్పుడు అంతటా కవరపెడుతోంది.
ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్క ఉన్న వారికి పెద్ద ఎత్తున వైరస్‌ విస్తరిస్తుంది. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కావడంతో చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణా సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌ు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. నాుగో దశ అంటే వైరస్‌ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ఈ దశను తొలిసారిగా చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసు సంఖ్య 80 మే దాటిపోయింది. ఆస్యంగా మేల్కొన్నప్పటికీ..కఠిన చర్యు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది.
భారత్‌లో ప్రవేశించిన కరోనా ప్రస్తుతానికి రెండో దశలో ఉంది. అంటే విదేశీయుతో సంబంధం లేకుండా ఇండియాలో ఉన్నవారి నుంచే ఇండియాలో ఉన్నవారికి కరోనా వైరస్‌ సోకుతోంది. ఇది మూడో దశకు వెళ్తే ప్రమాదమే. అప్పుడు ఇటలీ, ఇరాన్‌లో లాగా వైరస్‌ విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అది రాకుండా భారత్‌ అప్రమత్తమైంది. ముందుస్తుగానే ఇండియా జాగ్రత్త పడుతోంది. ఓ నె పాటూ ప్రజంతా స్వయంగా జాగ్రత్తు పాటిస్తేనే మూడో దశలోకి వెళ్లకుండా ఉండగమని నిపుణు చెబుతున్నారు. తాజాగా హర్యానా, పుదుచ్చేరిలో కూడా కొత్త కరోనా కేసు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకూ కరోనా సోకుతున్న రాష్ట్రా సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఎక్కువ కరోనా కేసున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎడమ చేతుపై స్టాంప్‌ ట్యాగ్‌ వేసి 14 రోజు ఇళ్లలోనే ఉండేలా చేస్తోంది. దేశంలో తొలి కరోనా మృతి సంభవించిన కర్ణాటకలో హెల్త్‌ ఎమర్జెన్సీ ఉంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇక రైల్వే శాఖ ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ రేటును రూ.50 చేసింది. తద్వారా ఎక్కువ మంది రైల్వేస్టేషన్లకు రాకుండా ఆపాని చూస్తోంది.
దేశంలో కరోనా వైరస్‌ సాంకేతికంగా రెండో దశలోనే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఒకవైపు రెండోదశ తాూకు జాగ్రత్త చర్యను తీసుకుంటూనే, మూడోదశలో తీసుకోవాల్సిన చర్యకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సామూహిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రయివేటు ఆసుపత్రుల్ని, లేబొరేటరీను కూడా భాగస్వాముల్ని చేస్తోంది. ముఖ్యంగా మహరాష్ట్రలాంటి చోట్ల ఇలాంటి చర్యు సత్వరం అనివార్యమవుతున్నట్టు కేంద్రం గుర్తించింది. ఐసొలేషన్‌ వార్డును పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వస్తుందన్న ఆలోచనతో ఎన్నెన్ని ఇండిపెండెంట్‌ రూము, బెడ్లు అవసరమవుతాయన్న అంచనా తయారీలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నట్టు తొస్తోంది. హెల్త్‌కేర్‌ వర్కర్లకు పెద్ద ఎత్తున శిక్షణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాప్తిలో దేశం గనక మూడో దశలోకి ప్రవేశిస్తే హెల్త్‌ ప్యాకేజీను, ఇతర ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేయాని ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా పథకానికి నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్‌ హెల్త్‌ అథారిటీని ఆదేశించారు.
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి-కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌)లోకి వ్యాపించడానికి దేశానికి కేవం 30 రోజు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాుగు దశు దాటిపోతే వ్యవస్థన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రు, పడకు ఇతర మౌలిక సదుపాయాు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మే ల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యు చేపడితే..వైరస్‌ భారీ నుంచి సుభంగా బయటపడొచ్చని కోవిడ్‌-19 హైదరాబాద్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీహర్ష యాదవ్‌ సూచించారు. ఆయన మాటల్లోనే…
మొదటి దశ : చైనా, ఇటలీ, ఇరాన్‌, అమెరియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఇండోనేషియా దేశాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్‌గా వస్తుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు మెగు చూసిన కేసున్నీ ఈ దశవే. విదేశాకు వెళ్లి వచ్చేవాళ్లను ఆయా దేశాల్లోనే నియంత్రించడం ద్వారా తొలి దశలోనే వైరస్‌ను కట్టడి చేయవచ్చు.
రెండో దశ : విదేశాకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యు, సహోద్యోగుకు వైరస్‌ విస్తరింపజేసే దశ. దేశంలో ప్రస్తుతం ఈ రెండో దశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికు దిగగానే వారిని స్క్రీనింగ్‌ చేయ డం, క్షణాు ఉన్నవారిని ఆస్పత్రుకు తరలించి, చికిత్సు చేయించడం, వ్యాధి క్షణాు లేకపోయినా వారిని ఇతరుకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించకుంట్ట కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం మనం రెండో దశలోనే ఉన్నాం.
మూడో దశ : ఇది అత్యంత కీకమైనది. ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్క ఉన్న వారికి పెద్దెత్తునవైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణా సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌ు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి.
నాుగో దశ : వైరస్‌ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్‌ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసు సంఖ్య 80 మే దాటిపోయింది. ఆస్యంగా మేల్కొన్నప్పటికీ..కఠిన చర్యు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్‌, ఇటలీ వంటి దేశాు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష…
బయటి దేశా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 14 రోజుల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందు తలెత్తితే కరోనా వైరస్‌గా అనుమానిస్తారు. సాధారణంగా వైరస్‌ రెండు నుంచి 14 రోజుల్లో బయటపడుతుంది. తుంపర్లు, ముట్టుకోవడం వ్ల ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ముఖ్యంగా వ ృద్ధు, చిన్న ప్లిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జనసమూహానికి దూరంగా ఉండటం, ముక్కుకు మాస్కు ధరించడం, తరచూ చేతు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరస్‌ భారీ నుంచి కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యం.