దేశంలో కరోనా ప్రభావం లేదు

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢల్లీి : ఇతర దేశాతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సమావేశమై కరోనాను అరికట్టేందుకు ఢల్లీిలో తీసుకుంటున్న చర్యపై సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం హర్షవర్ధన్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ దేశంలో వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యను తీసుకున్నామని తెలిపారు. జనవరి 18వ తేదీ నుంచి దేశంలో ప్రముఖమైన ఏడు ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడు 30 ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 8,74,708 మంది ప్రయాణికును స్క్రీనింగ్‌ చేశామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఒక వేళ ఢల్లీిలో కేసు పెరిగితే ఏం చేయానే అంశాపై ఢల్లీి ప్రభుత్వంతో చర్చించామని తెలిపారు. ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు, క్వారంటైన్‌ సౌకర్యాు, డాక్టర్ల భ్యతతో ఇతర అంశాు చర్చకు వచ్చాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 43కి చేరుకుంది.