కోల్‌కతాలో ముగ్గురికి కరోనా

 నిర్ధారించిన విమానాశ్రయ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికాయి

కోల్‌కతా: భారత దేశంలో కూడా కోవిడ్‌-19 బాధితు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం కోకతాలోని నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి నోవల్‌ కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్‌ నుంచి కోకతా చేరుకున్న ప్రయాణికుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు విమానాశ్రయ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికాయి గురువారం తెలిపారు.  దీంతో కోల్‌కతాలో కరోనావైరస్‌ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది.  మంగళ, బుధవారాల్లో కోకతా విమానాశ్రయంలో హిమాద్రి బార్మాన్‌, నాగేంద్ర సింగ్‌ ఇద్దరు ప్రయాణికుకు నిర్ధారిత పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని విమానాశ్రయం డైరెక్టర్‌ కౌశిక్‌ భట్టాచార్జీ పీటీఐకి తెలిపారు. వీరిద్దరినీ బెలియాఘాటా ఐడి ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. అంతకుముందు అనితా ఒరాన్‌ అనే ప్రయాణీకుడికి కూడా థర్మల్‌ స్కానింగ్‌ సమయంలో పాజిటివ్‌ వచ్చినట్టు భట్టాచార్జీ చెప్పారు. మరోవైపు  స్పైస్‌జెట్‌ విమానంలో బ్యాంకాక్‌ నుంచి  ఢల్లీి వచ్చిన ఢల్లీి విమానాశ్రయంలో  ఒక ప్రయాణికుడిని కరోనా  వైరస్‌ బాధితుడుగా అనుమానిస్తూ, పరీక్షు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే కోల్‌కతా, చైనా మధ్య ప్రత్యక్ష విమానాను కలిగి ఉన్న రెండు విమానయాన సంస్థు తమ విమాన సేవనుతాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకా మేరకు ఇండిగో ఫిబ్రవరి 6- 25, 2020 వరకు కోల్‌కతా- గ్వాంగ్‌జౌ మధ్య తన విమానాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో తరువాత, చైనా ఈస్టర్న్‌ ఎయిర్లైన్స్‌ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 29 వరకు చైనాలోని కోల్‌కతా, కున్మింగ్‌ మధ్య విమానాను నిలిపివేసింది. చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ బ్యాంకాక్‌ నుండి కోల్‌కతాకు వచ్చే విమాన ప్రయాణికును జనవరి 17 నుండి క్షుణ్ణంగా  పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.