కోటి బతుకమ్మ చీరలు

23 నుంచి పంపిణీకి సిద్ధం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన గురువారం జరిగింది. ప్రదర్శనను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… 24 వేల పైచిలుకు మగ్గాలు పనిచేసి 100 డిజైన్లతో కోటి చీరలు జిల్లాలకు సరఫరా చేసి 23వ తేదీ నుంచి పంపిణీకి అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసింది. బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 23 నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.