అర్హులందరికీ ‘ఆరోగ్యశ్రీ’
- ప్రాణం విలువ నాకు బాగా తెలుసు
- రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశా
- 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశా
- ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం
- కోవిడ్ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం
- అసెంబ్లీలో వెల్లడించిన సీఎం జగన్
ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని తెలిపారు. రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్ఎంను నియమించామన్నారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ప్రాణం విలువ తెలుసుకాబట్టే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నా మని సీఎం పేర్కొన్నారు. ఒకేసారి 1180 అంబులెన్స్లను ప్రారంభించాం. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ప్రపంచానికే కొవిడ్ పెద్ద సవాల్గా మారింది. గత ఏడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో శాంపిల్స్ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవి.. ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చాం. తొలి వేవ్లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్ వేవ్లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు మనకు లేవు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు రాష్ట్రంలో లేవు. కొవిడ్ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామని జగన్ తెలిపారు. అందుకే సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండేళ్ల కాలంలో ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా సంక్షేమ పాలన అందించామని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు. కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందు బాటులోకి తీసుకొచ్చాం . కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం.18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్ను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇకపోతే బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాం. దీని చికిత్స కోసం 17 ఆస్పత్రులను నోటిఫై చేశామన్నారు. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేస్తాం. 50 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశాం. కోవిడ్ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలుగుతున్నా మని వివరించారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కానీ దేశంలో నెలకు 7 కోట్ల డోసుల ఉత్పత్తికి మాత్రమే సామర్థ్యం ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 7 కోట్ల డోసులు అవసరం ఉంది. వ్యాక్సిన్ కోటా కేటాయింపు పక్రియ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది. అయినా వాస్తవాలు తెలిసి కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారు. వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం.. ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలిరాష్ట్రం ఏపీ అని జగన్ చెప్పారు.