తెలంగాణలో… నైట్‌కర్ఫ్యూ వారం పొడిగింపు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను తెలంగాణ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 20‌వ తేదీ నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించించగా శుక్రవారంతో ముగియనుంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడిం చకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లో వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ ‌జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. పాలనా విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని, ప్రభుత్వం ఇటీవల విధించిన రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు శుక్రవారం ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.