టీటీడీ ఆధ్వర్యంలో 28న కల్యాణమస్తు

తిరుమల,జ్యోతిన్యూస్‌ :
‌సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కళ్యాణమస్తులో వివాహం చేసుకోవడానికి ఆసక్తి గల అవివాహితులైన యువతీయువకుల నుంచి టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టీటీడీ గతంలో పెద్ద ఎత్తున కల్యాణమస్తు సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధప్రదేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు పత్ర?లు లిలిలి.బితిసబీపజ్గీ•జీ.నీసణ నుంచి కానీ, ఆయా జిల్లాల హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ‌పోగ్రాం అసిస్టెంట్స్ ‌నుంచి గానీ పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్‌ 25‌వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రాలల్లోని కల్యాణ మండపాల కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది.