కొత్త పార్టీకి సన్నాహాలు…

  • హైదరాబాద్‌లో షర్మిల వరుస భేటీలు
  • షర్మిలతో భేటీ అయిన మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్‌ ‌షర్మిల.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం బెంగుళూరు నుంచి ఆమె హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. తాజాగా సోమవారం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి షర్మిలను కలిశారు. వైఎస్‌ఆర్‌ ‌హయాంలో, కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి సమయంలో.. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, సమావేశం అనంతరం డియాతో మాట్లాడిన రంగారెడ్డి.. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశానన్నారు.. షర్మిలపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికిన ఆయన.. వైఎస్‌ ‌చనిపోయినా వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారు.. ఇది అభినందనీయం అన్నారు. మహిళలను ప్రోత్సహించాలి, గౌరవించాలన్నారు. ఇక, లక్షలా మంది ప్రజాప్రతినిధులను వైఎస్‌ ‌తయారు చేశారు.. వైఎస్‌ ‌కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డువంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని రంగారెడ్డి గుర్తుచేశారు. వైఎస్‌ ‌షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దని మా పార్టీ నేతలకు సూచిస్తున్నాన్న ఈ కాంగ్రెస్‌ ‌నేత, నిజాయితీ పనులు చేసే వారిని అభినందించాలన్నారు.. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు నాయకులు కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగి.. ఇప్పుడు ఆయన్ని విమర్శించం గొప్ప కాదని మండిపడ్డారు.మరోవైపు పార్టీ ఆవిష్కరణకు రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న షర్మిల పార్టీ ఆవిష్కరణ?.. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.గతంలో మే 14న ముఖ్య మంత్రిగా వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మే 14నే పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జూలై 8న రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి కావడంతో ఆ రోజును షర్మిల సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్‌ ‌చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.
షర్మిల పార్టీలోకి అందరూ ఆహ్వానితులే: కొండా
రాజన్న పాలన, సంక్షేమ పథకాలు ఉండాలని కోరుతూ వచ్చే ప్రతి ఒక్కరూ షర్మిల కొత్త పార్టీలోకి ఆహ్వానితులేనేని, ఏ పార్టీ నుంచి వచ్చినా ఆహ్వానిస్తామని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన లోటస్‌ ‌పాండ్‌ ‌వద్ద డియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్టాల్రలో ఒక మహిళ పార్టీ నడిపిన దాఖలాలు లేవని అన్నారు. మొదటిసారిగా దివంగత వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తె షర్మిల ప్రజల్లోకి వస్తున్నారని.. ముఖ్యంగా మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్‌ 10‌వ తేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయని, ఆ తర్వాత అన్ని జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్‌ ‌కార్యాచరణ ప్రకటిస్తామని రాఘవరెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్నదానికంటే మెరుగైన పద్ధతిలో ముందుకు వెళతామన్నారు. మమ్మల్ని విమర్శిస్తున్నవాళ్లకు తాము వేస్తున్న అడుగులే జవాబులని చెప్పారు.