ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా -ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడంకోసం రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, అన్నారు. శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలోని 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆడబిడ్డ 18 ఎళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామాలలోనిరుపేద కుటుంబాలకు ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, షాధీముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాలకోసం ఒక లక్ష 116 రూపాయలు అందజేస్తుందన్నారు. గతంలోఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కెసిఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.