సరికొత్తగా పాలన…

  • – ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ నగరం
  • – ధరణి పోర్టల్‌ ద్వారానే భవిష్యత్‌లో రిజిస్టేష్రన్లు
  • – ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదు
  • – ప్రజలకు వారి ఆస్తులపైన హక్కులు కల్పించాలన్నదే లక్ష్యం
  • – ఎవరు కూడా దళారులను నమ్మి పైసలు ఇవ్వొద్దు
  • – అధికారులతో సవిూక్షలో మంత్రి కేటీఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :
భవిష్యత్‌లో అన్ని రిజిస్టేష్రన్లు ధరణి పోర్టల్‌ ద్వారానే జరుగుతాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పేద, మధ్యతరగతి వారికి ఆస్తుల పట్ల హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకు పోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ నగరం ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింద న్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేర్వేరు రంగుల్లో పాస్‌ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేసినట్లు వెల్లడించారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ విస్తరిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కా రానికి ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని కేటీఆర్‌ తెలిపారు. కేవలం ప్రజలకు వారి ఆస్తుల పైన హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తోందన్నారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్క పైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాన న్నారు. ఈ మొత్తం పక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ లో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చిం దని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గత ఆరేళ్లలో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ విస్తరిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. సాగు భూములపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనా లని కేటీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరిం చేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు.. ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను నమ్మొద్దు.. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని కేటీఆర్‌ సూచించారు. ఈ మొత్తం పక్రియ పారదర్శ కంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామా న్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నాము అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంపీ ప్రధాన కార్యాలయం నుంచి గ్రేటర్‌ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కాలనీ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి చర్చించారు.