వచ్చే ఏడాది చివరినాటికి ‘పోలవరం’

  • – సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి కార్యాచరణ
  • – త్వరిగతిన నిర్దేశించిన ప్రాజెక్టులకు మోక్షం
  • – మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం
  • – వచ్చే ఏడాది చివరినాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యం
  • – సీఎం జగన్‌ ఆదేశాలతో చకచకా సాగుతున్న పనుల

అమరావతి,జ్యోతి న్యూస్ :

రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్ల లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ల లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని రూ.84092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ ల పూర్తి చేయడానికి రూ.72458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధుల సవిూకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీల స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేస్తుంది.ఓ వైపు పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనుల చేయిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఇతర ప్రాజెక్‌ట్లపైన అదే విధంగా దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్‌ట్లో కుడి, ఎడమ కాలవుల గతంలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తయ్యాయి. ప్రధాన జలాశయ నిర్మాణ పనుల నత్తనడకన నడుస్తుండడంతో గతంలో పనిచేసిన సంస్థను ప్రభుత్వం రద్దు చేసి మేఘా ఇంజనీరింగ్‌ ఇన్ఫాస్టక్చ్రర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)కు అప్పగించిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్‌ట్లో 71.46 శాతం పనుల పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి.   ప్రస్తుతం గోదావరికి వరదల ఉన్నప్పటికీ పనుల ఆగకుండా స్పిల్‌ వే కాంక్రీట్‌ బ్రిడ్జ్ పనుల చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్‌ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు టాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశిరచారు. ప్రాజెక్‌ట్ల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధం కానుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎసస్పీవీలను ఏర్పాటు చేశారు. పల్నాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా – పెన్నాల అనుసంధానం కోసం రూ.7636కోట్లు ఐదేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పీవీ-5 కార్యక్రమం క్రింద కృష్ణా-కొల్లేరు సెలినిటి మిటిగేషన్‌ కార్యక్రమం ద్వారా రూ.3356 కోట్లు సవిూకరిస్తారు. సాగునీటి ప్రాజెక్‌ట్లకు నిధుల సవిూకరణకు ఎస్పీవీల ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్‌ట్లను పరుగుల పెట్టించి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికల ను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగు తున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం-2, పూల సుబ్బయ్య వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌ పనుల, వంశధార- నాగావళి లింక్‌, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనుల పరుగుల పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాజీల ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు వలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని అలాగే ఆ ప్రాజెక్ట్ ల్లో నీరు నిండితే ఆయా ప్రాంత రైతుల ఉపయోగకరం అన్న విషయంపై రైతులకు నచ్చచెప్పి, అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాల ని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనుల వేగంగా పూర్తి చేయాలని, ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనుల ఇప్పటి పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. త్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనుల వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నరు. వంశధార-నాగావళి అనుసంధానం పనుల ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనుల జరుగుతున్నాయి. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌పూర్తయితే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలగుతుంది. అలాగే 24,600 ఎకరాలకు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటి దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు  అధికారుల తెలిపారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు.