ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ
- – రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతుల శుభాకాంక్షల
- – సిఆర్,జగన్ జన్మదిన శుభాకాంక్షల
- – బర్త్డే విషెష్ చెబుతూ రాహుల్ ట్వీట్
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రపతి రావ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు శుభాకాంక్షల తెలిపారు. ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ జీవన విలవల పాటిస్తూ, ప్రజాస్వామ్య సాంప్రదాయ ఆదర్శాన్ని ప్రదర్శిస్తూ దేశాన్ని అంతర్జాతీయంగా ఉన్నతస్థానానికి తీసుళ్లారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో డిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షల తెలపుతూ ట్వీట్ చేశారు. 70వ జన్మదినం జరుపుకుంటున్న మోదీకి ఆయా రాష్ట్రాల సీఎంల, నాయకుల, సినీ, క్రీడా ప్రముఖుల పుట్టిన రోజు శుభాకాంక్షల తెలపుతున్నారు. మోదీ బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల దేశ వ్యాప్తంగా పల సేవా కార్యక్రమాల చేపడుతున్నారు. 70 జీల లడ్డూను డా తయారు చేయించినట్లు బీజేపీ కార్యకర్తల తెలిపారు.
మోడీకి సిఆర్,జగన్ జన్మదిన శుభాకాంక్షల….
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినంసందర్భగా తెలగు రాష్ట్రాల సిఎంల శుభాకాంక్షల తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ప్రకటన వారు వేర్వేరుగా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షల తెలిపారు. ఈమేరకు సీఆర్ మోదీకి ఓ సందేశాన్నిపంపారు. భగవంతుడి అనుగ్రహం విూకు ఎల్లవేళలా ఉండాలని, దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షల తెలిపారు.’ప్రధాని మోదీజీ విూకు పుట్టినరోజు శుభాకాంక్షల. ఇలాంటి పుట్టినరోజుల మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురా రోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి ట్విటర్ ద్వారా శుభాకాంక్షల తెలిపారు. ‘దేశ సేవకు అంకితమైన విూరు ఇలాంటి పుట్టినరోజుల మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. దేశానికి విూలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం మాకు ఆశీర్వాదం అంటూ తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షల తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు.