స్థిరంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ

  • రోనా సంక్షోభంలోనూ అదుపులోనే ఆర్థిక పరిస్థితి
  • ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి 

ముంబాయి,జ్యోతిన్యూస్ : భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, స్థిరంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద మెండుగా ఉన్నాయని, మొత్తంమీద భారత బ్యాంకింగ్ వ్యవస్థ ధృఢంగానే ఉందని దాస్ గురువారం వెల్లడించారు. ఈ సంక్షోభం ముగిసిన అనంతరం ఆర్థిక స్థిరీకరణ కోసం చాలా జాగ్రత్తగా, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత చర్యలను ఆర్బీఐ చేపట్టనుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలో పేతం చేసుకోవాలన్నారు. ఒక వెబ్ నార్ సిరీస్ ఈవెంట్ ముఖ్య ప్రసంగంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంకింగ్ విధానాలు కానీ .. రేటు తగ్గింపు అంశంలో తమ విధానాలను మార్చలేదన్నా రు. తాము నిరంతరమూ జాగ్రత్తగా ఉన్నట్లు చెప్పారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. దాన్ని ఎదుర్కొనే రీతిలో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. ఫ్రాడ్ కేసులు పెరుగుతున్న అంశంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల వద్ద లక్ష రూపాయల కన్నా ఎక్కువ మోసం చేసిన కేసుల సంఖ్య 159 శాతం పెరిగినట్లు ఇటీవల ఆయన చెప్పారు. 2020 వార్షిక సంవత్సరం సుమారు రూ.1.86 ట్రిలియన్ ఫ్రాడ్ జరిగినట్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యల్ని వెంటనే నిలిపివేయడం లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యల్ని నిలిపివేసిందన్న ఊహాగానాలకు అర్థం లేదన్నారు. సంబంధిత చర్యలపై ఆర్ బీఐ దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉండబోతోందనే దానిపై స్పష్టత రాగానే ద్రవ్యోల్బణం, అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను ఆర్ బీఐ విడుదల చేస్తుందని శక్తి కాంత్ దాస్ పేర్కొన్నారు. రేట్ల కోత అయినా, లేదా ఇతర విధానపరమైన చర్యల నిమిత్తం అయినా ఆర్ బీఐ దగ్గర అస్త్రాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ భరోసా ఇచ్చారు. మహమ్మారి కట్టడి అనంతరం ఆర్థిక రంగం సాధారణ స్థితికి చేరుకునేందుకు జాగ్రత్తగా బాటలు వేయాల్సిన అవసరం ఉందని దాస్ ఉద్ఘాటించారు. ఏదేమైనా, ఈ చర్యలను త్వరలోనే ముగిస్తుందని ఏ కోణంలోనూ భావించరాదని ఆయన స్పష్టం చేశారు. అతిగా రక్షణాత్మక వైఖరి అవలంబి ంచడం ద్వారా చివరికి బ్యాంకులకే నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. కరోనా ఒత్తిడిని ఎదుర్కొం టున్న రుణగ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ మంచి ఉపశమనం ఇస్తుందని చెప్పారు. లాక్ డౌన్ సందర్భంలో రుణాల పై తాత్కాలిక నిషేధం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. ఈ సమయంలో బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నా యనేది స్పష్టం..కానీ, ఈ సవాళ్లకు ఎలా స్పందిస్తాయి, ఎలా ఎదుర్కొంటాయినేది కీలకమని ఆయన వ్యాఖ్యానించా రు. మరోవైపు మహమ్మారి పై కట్టడిలో కేంద్రం ప్రభుత్వం స్పందించిన తీరునున దాస్ ప్రశంసించారు.