వలస కార్మికులను పట్టించుకోండి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా వేళ కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సమస్యను ప్రభుత్వం తొలి ప్రాధాన్య అంశంగా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మే 3 తర్వాత లాక్ డౌనను కేవలం హాట్ స్పాట్ కేంద్రాలకే పరిమితం చేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తాత్కాలిక ఉపసంహరణ చర్యగా (పాజ్ బటన్ లాంటిది) అని రాహుల్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మే 3 తర్వాత హాట్ స్పాట్ కేంద్రాల్లో మాత్రమే లాక్ డౌనను పొడిగించాలన్నారు. గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను పునరుద్ధరించాలని రాహల్ కోరారు. స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతించండి: ప్రియాంక లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతకంటే ముందు కార్మికులకు తగిన పరీక్షలు నిర్వహించి, జాగ్రత్తలు చెప్పాలన్నారు. కరోనా పై పోరాటంలో శత్రుత్వం కాదు.. దయ, జాలి కీలకపాత్ర పోషిస్తాయని ప్రియాంక అన్నారు.