ఆరోగ్య ధరిత్రి కోసం ప్రతిజ్ఞ చేద్దాం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: పరిశుభ్ర, ఆరోగ్య, శ్రేయస్కరమైన ప్రపంచం కోసం అందరం కృషి చేద్దామని ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. “ఎంతో ప్రేమతో అందర్నీ సంరక్షిస్తున్న భూమికి మనమందరం కృతజ్ఞత తెలియజేయాలి. పరిశుభ్ర, ఆరోగ్య, శ్రేయస్కరమైన ధరిత్రి కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే కొవిడ్-19 పై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న యోధులందరికీ బాసటగా నిలుద్దాం” అని మోదీ ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణే నినాదంగా 1970 నుంచి ఏటా ఏప్రి ర్యావరణ పరిరక్షణే నినాదంగా 1970 నుంచి ఏటా ఏప్రిల్ 22న దాదాపు 195 దేశాల్లో ధరిత్రీ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. దేశ ఆర్థిక పరిస్థితి, కొవిడ్ ప్రభావం, తదుపరి చర్యల పై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం సమావేశమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అంశం పై చర్చించినట్లు సమాచారం.